Monday, December 30, 2013

స్త్రీ పురుషులు ఒకటయితే పుట్టినోళ్ళు , స్త్రీ వేరు, పురుషుడు వేరు అనటమే విడ్డూరం

                                                      

   
  స్త్రీ వాదం స్త్రీల హక్కుల కొరకు మాత్రమే పోరాటం చెయ్యడం ప్రారంబించాక ,వాటి వలన లాబాల సంగతి ఏమో కానీ దానికి వ్యతిరేకంగా పురుష వాదం కూడా పుట్టుకొచ్చింది. అసలు నాకొక డౌట్  ఏమిటంటే కార్మికుల సంఘాలు  లాగా స్త్రీల హక్కుల సంఘాలు , పురుష హక్కుల సంఘాలు అనేవి  ఉండడం వాంచనీయమా? ఒక సమాజంలో స్త్రీల సమస్యలు అనేవి పురుషులకు సంబందం లేకుండా ఉంటాయా? అలాగే పురుషుల సమస్యలు అనేవి స్త్రీలకు సంబందం లేకుండా ఉంటాయ?

   ఉదాహరణకు ఒక కుటుంబం లోని పురుషుడు తప్పు చేస్తే , దానికి బాదిత స్త్రీలు కు సంబందించిన వారు స్పందిస్తే , ఈ  పురుషుడు తాలూకు స్త్రీలు ఎవరి పక్షం వహిస్తారు? బాదిత స్త్రీల వైపా ? లేక తమ పురుషుడు వైపా? . ఖచ్చితంగా తమ పురుషుడి వైపే ఉంటారు. ఎందుకంటే ఆతను వారికి రక్త సంబదీకుడో , బందువో అయి ఉంటాడు కాబట్టి. కానీ కార్మికుల సంఘాల విషయం లో అలా కాదు. కార్మికుడి కి అన్యాయం జరిగిందని బావిస్తే కార్మికులు అంతా ఒకే పక్షం. అది కార్మిక పక్షం. ఇదే సూత్రం పురుష హక్కులకు వర్తిస్తుంది. కాబట్టి మానవ హక్కులు నుండి స్త్రీల హక్కులు , పురుష హక్కులు అంటూ ప్రత్యేకంగా విడదీసి చూడడం అసంబద్దం అవుతుంది.                                          
                                                            

   మనిషి భూమి మీద ఉన్న జీవ రాసులలో చాలా తెలివిగల వాడినని విర్రవీగుతుంటాడు. తనకు జ్ఞానం  ఉంది కాబట్టి తోటి మానవుడు తన పట్ల జరిగే అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నాడు . అందుకు సంతోషించ వలసిందే. కానీ అదే సూత్రాన్ని తోటి జీవుల పట్ల మాత్రం వర్తింప చేయడు.ఉదాహరణకు  ఒక సెల్ టవర్ ని ఒక ప్రాంతం లో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం లోని చిన్న జీవులు మరణిస్తాయి అని మనిషికి తెలిసినా, తన సౌలబ్యం  కోసం వాటి ప్రాణాలు తీసే పనినే చేస్తున్నాడు. అంటే ఇక్కడ పక్కా స్వార్దం . ఈ  భూమి మీద  మనిషి మత్రమే బ్రతకాలన్న స్వార్దం. అది కూడదన్న  "బుద్దుడు " లాంటి వారిని బొమ్మను చేసి , ఆయన్ని పూజిస్తూ తన జీవ హింస తానూ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి మానవ  హక్కులు  కూడా ప్రపంచ జీవుల  జీవ హక్కులు కు వ్యతిరేకమైనవే. కానీ ఇక్కడ మనిషి తానూ ఇతర జంతు కోటికి బిన్నంగా ఎదిగాడు కాబట్టి వాటి నుండి విడి పోయి "మానవ హక్కులు" అనేవి ప్రత్యేకంగా ఏర్పరచుకోగలిగాడు. మరి ఆ పని మనిషిలో బాగంగా ఉన్న స్త్రీలు కానీ, పురుషులు   కానీ చెయ్య గలరా? (చెయ్యడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తునట్లుంది గే, లెస్బియన్ మేదావులు)

   కాబట్టి ఏ స్త్రీ తనలో ఉన్న తండ్రికి వ్యతిరేకంగా , అలాగే పురుషుడు తనలో ఉన్న తల్లికి వ్యతిరేకంగా ప్రవర్తించడానికి ఇష్టపడరు. ఇక పోతే పురుషుల మీద స్త్రీలు, స్త్రీల మీద పురుషులు ప్రదర్శించే అయిష్టత , కోప తాపాలు ఇవ్వన్నీసహజ  మానవ చర్యలలో బాగాలే తప్పా , ఒక జాతి పట్ల మరొక జాతి ప్రదర్శించే ప్రతిస్పందనలు  లాంటివి కావు. కొంత మంది తమ మీద తమకే ద్వేషం కలిగి ఆత్మహత్యలు చేసుకుంటుటారు. అంత మాత్రం చేత వారు ఎప్పుడూ  తమకు తామే వ్యతిరేకంగా ఉంటారని అనలేము కదా!. అలాంటివే స్త్రీ పురుష సంబందాలు. కాబట్టి మనుష్యులకు  సమస్యలు ఏర్పడినప్పుడు  అవి మానవ  సమాజ సమస్యలు గా బావించి వాటి నివారణకు మానవు రూపాలైన స్త్రీ పురుషులు కలసి పని చెయ్యాలి కానీ, మీకు మీరే , మాకు మేమే అంటే అది సమగ్ర ద్రుష్టి  కాదు అని నా అభిప్రాయం.


   

Friday, December 27, 2013

రెండు బలమైన ఎమోషనల్ గ్రూపులుగా విడిపోయిన తెలుగు జనాన్ని "చీపురు కట్ట ఇస్తే ఊడ్చి పారేస్తా" అనడంలో అర్దముందా?

                                                         

మన రాష్ట్రం లో కొంత మంది మేదావులకి జనం సైకాలజీ అస్సలు అర్దం కాదు. ఆ ఒక్క కారణం చేతనే అరవై ఏండ్లుగా కమ్మ్యునిస్ట్ మేదావులు అధికార పీఠం సాదించ లేక పోయారు , ఇక ఇప్పుడైతే కనీసం ప్రతిపక్ష పీఠం ని కూడా సాదించలేక , ఉన్న స్తానాలు ఎలా నిలబెట్టుకోవాలిరా "మార్క్స్" దేవుడా అని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు.కొందరేమో  రష్యన్ల రాజకీయ పరిస్తితిలోనూ , మరి కొందరేమో చైనా  రాజకీయ పరిస్తితిలోనూ ఇండియా రాజకీయ పరిస్తితులను పోల్చి , పోల్చి 'ఇదిగో సోషలిజం తేవడానికి ఇవే అనువైన పరిస్తితులు' అంటూ పాడిందే పాడి , పాడిందే పాడి జనాలకు విసుగు వచ్చేలా చేసారు . చివరకు ఆ దేశాలలో ప్రజలు తమ మైండ్ సెట్ మార్చుకుని ప్రపంచం తో అభివృద్దిలో పోటీ పడటానికి అనువైన మార్గాలు ఎంచుకుని ఆ దారిలో నడవడం ప్రారంబించేసరికి  ఇక్కడ మన మేదావులకి మేటర్ లేకుండా పోయింది. అలా తిరోగమనం లోకి నెట్టబడ్డారు. దీనంతటికి కారణం " ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలన్న " ఇంగిత జ్ఞానం లేక పోవడం. ప్రజలలో తమ పట్ల ఎమోషనల్ పీలింగ్ ఉన్నప్పుడే సఖ్యతతో అధికారాన్నిచేపట్టి , ఆ తర్వాత ప్రజా అనుకూలంగా పాలన సాగించి ఉంటే కొంత అయినా సక్సెస్ అయి ఉండే వారు. ఒక్క పశ్చిమ బెంగాల్ వారు ఆ పని చేసారు. అదిగో అప్పుడు కమ్మ్యూనిశ్ట్ మేదావులు  చేసిన తప్పులనే  ఇప్పుడు లోక్ సత్తా అది నేత జయ ప్రకాశ్ నారాయణ్ గారు చెయ్యడానికి సిద్ద పడుతున్నారు.

    ఈ  మద్య ఆయనొక వాదం తెర మీదకు తీసుకు వచ్చారు. అవినీతిని అంతమొందించడానికి డిల్లీ  ప్రజలు చూపిన పట్టుదల, విజ్ఞత తెలుగు ప్రజలు చూపలేరా? అని అయన గారి ప్రశ్న. డిల్లీలో ఆం ఆద్మీ పార్టీకి  ప్రజలు అదికారం కట్టబెట్టడానికి లేక అత్యదిక సీట్లు ఇవ్వడానికి కారణం అవినీతి మీద కేజ్రీవాల్ గారు సందించిన పోరాట అస్త్రమే అని అంటున్న  జయప్రకాష్ గారి మాటల్లో నిజం ఉన్నప్పటికి , అది మాత్రమే కేజ్రీ వాల్ కు సీట్లు కట్ట బెట్టింది అనుకోవడం పొరపాటే అవుతుంది. కాంగ్రెస్ కి ప్రజలలో ఉన్న వ్యతిరేకతే ఆటు B.J.P  కి కానీ , ఇటు ఆం ఆద్మీకి కానీ సీట్లు కట్ట బెట్టింది. అన్నా హాజారే మీద ప్రజకు ఉన్న ఎమోషనల్ టచ్  ని తెలివిగా కేజ్రీవాల్ రాజకీయ శక్తిగా మార్ఛాదు. అలాగే నిర్భయ ఉదంతం కూడా  ప్రజల ఎమోషనల్ ఫిలీంగ్ ని B.J.P , ఆం ఆద్మీ పార్టీల వైపు మరల్చేలా చేసింది. అంటే కాలం ఖర్మం అన్నీ కలసి వచ్చాయి. కాబట్టే కేజ్రీవాల్ ఈ  రోజు డిల్లీ గద్దె ఎక్కుతున్నాడు.

    మరి తెలుగు రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ  ప్రజలు ప్రస్తుతం రెండు బలమైన ఎమోషనల్ గ్రూపులుగా విడి పోయి ఉన్నారు. ఒకటి తెలంగాణా వాదులుగా కాగా , రెండవది సమైఖ్య వాదులు గా . మరి ఇటువంటి పరిస్తితుల్లో అవినీతి , చీపురు కట్ట అంటే ప్రజలు పట్టించుకుంటారా అనేది ప్రశ్న . ప్రజల ఎమోషనల్ ఫిలింగ్ ని అర్దం చేసుకోకుండా , కేవలం తన ఎమోషనల్ ఫీలింగ్ ని ప్రజలు అర్దం చేసుకోవాలి అని ఆశించే జయ ప్రకాశ్ గారు , ఆం ఆద్మీ తరహాలో లోక్ సత్తాకు ప్రజలు చేరువ అవుతారు అని అంచనా వెయ్యడం లో వింతేమి లేదు. కానీ అయన ఆలోచన సక్సెస్ అవ్వడమే వింత అవుతుంది . ఈ  మద్య ఒక  చానల్ చర్చలో ఒకరు విశ్లేషకులు మాట్లాడుతూ అసలు ఈ సారీ జయ ప్రకాశ్ గారు కూకట్ పల్లీ స్తానాన్ని  నిల బెట్టుకుంటారా? అని సందేహం వెలిబుచ్చారు. అదీ వాస్తవ అంచనా అంటే. అంతే కానీ ఎక్కడో డిల్లీలో ఆంఆద్మీ కి ప్రజలు పట్టం కట్టారని ఇక్కడ లోక్ సత్తాకు పట్టం కడతారా? నిజంగా ప్రజలకు అవినీతి మీద అంత ఏవగింపే ఉంటే అవినీతి సామ్రాట్టులు  అధికార కలలు ఎందుకు కంటారు?

   కాబట్టి జయ ప్రకాశ్ గారు అధికారం లోకి రావాలంటే , సమైక్యతా వాదం బుజాన వేసుకుని 294 సీట్లకు పోటీ చెయ్య గల సత్తా ఉండాలి . అప్పుడే లోక్ సత్తా గురించి ప్రజలు ఆలోచిస్తారు. ఒక వేళ ఎన్నికల లోపు రాష్ట్రం విడి పోతే దానికి ప్లాన్ వేరే ఉంటుంది. ఇవ్వన్నీ  లేకుండా ప్రజలని చీపురు కట్ట ఇవ్వమంటే ఇవ్వడం కష్టం. మరి ఎప్పటికీ ఇంతేనా ? జయప్రకాశ్ లాంటి వారు ఏమి చెయ్యాలి అని అంటే  టైం వచ్చేదాక ఇదిగో ఈ  క్రింది వీడియో లింక్ లో ఉన్న పాటలు మాదిరి పాటలు వినుకుంటూ  ఎమోషనల్ గా పోరాటం చేస్తూ ఉండడమే. 



      

Monday, December 23, 2013

ప్రేమికులను ఇలా కూడా బ్లాక్ మెయిల్ చెసే వారుంటారా? !

                                                         


సాదారణంగా ఎవరైనా పెద్దలకు తెలియకుండా ప్రేమించుకుంటుంటే వారి ప్రేమ వ్యవహారాలు తాలూకు పొటో లు తీసి ,అవి వారి పెద్దలకు చూపిస్తాం అని బ్లాక్మెయిల్ చేసి , అలా చెయ్యకుండా ఉండగలందులకు అంతో ఇంతో డిమాండ్ చేసే బ్లాక్ మైలర్ లు గురించి విన్నాం కానీ, పాపం అభం శుభం తెలియని అమాయకపు ప్రేమికులను తమ ఇష్టానికి వ్యతిరేకంగా పనులు చేయించి వాటిని సామాజిక సైటుల్లో పెట్టడమే కాక , వారి తల్లితండ్రులకు , స్నేహితులకు పంచుతామని బెదిరించి 3 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న బ్లాక్ మైలింగ్ ఉదంతం వింటుంటే కొంచం ఆశ్చర్యం వేయక  తప్పదు. వివరాలు లోకి వెళితే....

 ఒక అమాయి, ఒక అబ్బాయి . ఇద్దరూ మెడికల్ స్టూడెంట్ లు. వీరు మంగలోర్ లోని దార్లకట్టే లోని ఒక ప్రైవేట్ కాలేజిలో చదువుకుంటున్నరు. మొన్న 18 వ తారికున ఇద్దరూ సరిగ్గా రాత్రి 11 గంటలకు ఒక రెస్టారెంట్ బయట తమ కారులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే , దార్లకట్టె కు చెందిన రౌడి షీటర్ లు 8 మంది వచి వీరిద్దరిని కిడ్నాప్ చేసి ఒక ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్లరట. అక్కడ ఆ అమ్మాయి ,అబ్బాయిని  సెక్స్ లో పాల్గొనమని బలవంతం చేసారట . దానికి ఆ అమ్మాయి, అబ్బాయి , రామ ! రామ . అటువంటి పాడు పనులు మేము చేయమన్నారట! చేయకపోతే చంపేస్తామని బెదిరించారు అట! దానితో గత్యంతరం లేక సెక్స్ లో పాల్గొంటే ఆ రౌడీలు ఆ దృశ్యాలను సెల్ లో బందించి , 25 లక్షలు ఇవ్వమని, లేకుంటే వాటిని పేస్ బుక్ లో పెడతామని బెదిరించారు అట! చివరకు  ప్రేమికులు బ్రతిమాలితే 3 లక్షలకు O.K  అన్నారట. ఆ అబ్బాయిని తమవద్ద బందీగా ఉంచుకుని , అమయిని డబ్బు తెమ్మని పంపితే ఆ అమ్మాయి దైర్యం చేసి , ఒక న్యాయవాది ద్వారా పోలిస్ కంప్లైంట్ ఇచ్చి వారి నందరిని పట్టించింది అట. హేట్సాప్  టు అమాయి!

  ఈ ఉదంతం లో అంతా నమ్మబుల్ గానే ఉంది కానీ , బ్లాక్మెయిలింగ్ కోసం అన్నెం పున్నెం ఎరుగని అబ్బాయి, అమ్మాయిని బలవంతంగా కాని పని చేయించాల్సిన అవసరం ఏమిటి అనేదే డౌట్ గా ఉంది. పై పెచ్చు ఆ వీడియో ను వారి తల్లి తండ్రులకు చూపిస్తాం అని బెదిరించడం చూస్తుంటే ఎదో తేడా ఉంది కహానిలో అనిపిస్తుంది. ఏదో చదువుకుని వంశాన్ని ఉద్దరిస్తారు అనుకుంటే రాత్రి 11 గంటల వరకు  షికారు చేసే బాయి ప్రెండ్ గర్ల్ ప్రెండ్ లను చూస్తె రౌడి షీటర్ లకు మంఛి  ఆలోచనలు ఎందుకు వస్తాయి ? ఇంకా  నయం, అమాయిని వారు ఏమి చేయలేదు. లేకుంటే , మరో నిర్బయ ఉదంతం తో మంగలోర్ మార్మోగేది! దాంక్  గాడ్.

Friday, December 20, 2013

B.C కులంలో పుట్టినంత మాత్రానా B.C. నాయకులు కాలేరు, B.C ల అభివృద్ధి కోసం ఆలోచించే ప్రతి నాయకుడు B.C యే !.


                                                        

మన రాజకీయాలలో ఒక తప్పుడు అభిప్ర్రాయం  ఉంది . అదేమిటంటే B.C   కులం కి సంబందించిన రాజకీయ నాయకులు B.C  ల అభిరుద్ది కోసం తెగ ఆలోచిస్తారని, తక్కిన కులాల వారు ఎవ్వరూ B.C  ల సంక్షేమాన్ని పట్టించుకోరని. నిజమైన ప్రజా  నాయకుదు కి కుల మతాల వివక్షత లేకుండా ప్రలందరి సంక్షేమం గురించి ఆలోచిస్తాడు.

   అయితే మన దేశం లో ఉన్న ప్రత్యేక పరిస్తితుల వలన అంటే కొన్నీ యేండ్లుగా కుల వ్యవస్త మాటున కొన్ని వర్గాల ప్రజలు సామాజికంగా అణచి వేయబడ్డారు. వారిని ఇతర వర్గాల ప్రజలతో సమానం గా ఎదగడానికి కొన్న ప్రత్యెక రాయితీలు రిజర్వేషన్ ల రూపం లో ఇవ్వడం తప్పనిసరి అయింది. అలా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వర్గాలను ఎంపిక చెయ్యడానికి "కులం" ప్రాతిపదిక తప్పా , మరేది మెరుగైనడిగా కనపడ లేదు. అందుకే   షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులుగా ప్రజలను కుల ప్రాతిపదిక పరంగా గుర్తించి , వారికి రిజర్వేషన్ లు కలుగ చేసారు. కాబట్టి ఈ  వర్గాలుకు చెందిన ప్రజలు రాజ్యంగ పరంగా ప్రబుత్వ రాయితీలు  పొందడానికి అర్హులు.

   వీరు సంఘాలు పెట్టుకోవటానికి, తమ కోరికలు ప్రభుత్వాలకు చెప్పుకుని , తమ హక్కులు సాదించుకోవటానికి అర్హత కలిగిన వారు. వీరు నిర్వహింవ్చే సభలకు, సమావేశాలకు రాష్ట్రపతిని పిలిచినా , రావాల్సిన అవసరం ఉంది. అదే ఏ అగ్ర వర్ణం వారో సభ పెడితే అది "కుల సంఘ సభ" అవుతుంది. కానీ రాజ్యాంగం గుర్తించిన పై వర్గాల వారు ఎవరు సభ పెట్టినా అది కుల సంఘ సభ గ బావించి రావడానికి  ఏ అధికారి నిరాకరించరాదు. అది ఆ యా వర్గాలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నిరాకరిస్తున్నట్లు బావించవచ్చు.

    ఇక పోతే B.C  కులంలో పుట్టినంత మాత్రానా B.C.  నాయకులు కాలేరు, B.C  ల అభివృద్ధి  కోసం ఆలోచించే ప్రతి నాయకుడు B.C  యే అని నా అభిప్రాయం. ఈ  ప్రస్తావన ఎందుకంటే , మొన్న హైదరాబాద్ లో B.C ల హక్కులు గురించి  "బి.సి ల సింహ గర్జన " అనే పేరుతో , B.C లు కొంతమంది ఒక సభ నిర్వహించారు. దానికి B.C  నాయకులతో పాటు, పార్టి పరంగా 100 సీట్లు B.C  లకు కేటాయిస్తాను అని ప్రకటించిన , తెలుగుదేశం అదినేత నారా చంద్ర బాబు నాయుడు గారిని కూడా  వేదిక మీదకు ఆహ్వానించారట! దానితో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు కోపం వచ్చిన B.C  ల సభలో B.C  యేతరుడు ఎలా అని చిందులేస్తో , సభను వీడి వెళ్లి పోయారట! B.C  సభకు అన్నీ పార్టీల అద్యక్షులను పిలచి తమకు ఎన్నికలలో సగం సీట్లు కావాలని కోరితే బాగుండేది. కానీ అలా పిలవనంత మాత్రానా చంద్రబాబు గారు B.C  ల సభలో పాల్గొనే అర్హత లేదనడం "కొంచపు తనం" అవుతుంది తప్పా , అది B.C  లకు ఏ మాత్రం మేలు చేసే ఆలోచన కాదు.ఇదే సందు అని చెప్పి కొన్నీ చానళ్ళు దీన్ని రాజకీయం చేయాలని చూసాయి . అటువంటి దానిని ఈ  క్రింద ఇవ్వబడిన వీడియో లింక్ లో చూడండి. 

          
            

Sunday, December 15, 2013

ABN చానల్ వారు చేసిన స్టింగ్ ఆపరేషన్ ఎందుకు డంగై పోయింది!?

                                                             



                             తెలుగు జాతి రక్తంలో అవినీతి అనేది ఇంకి పోయింది. తెలుగు రాష్ట్ర విబజన గురించి ఎంతో మరిగి పోతున్న  జాతీ రక్తం అవినీతి అంటే చల్లగా గడ్డ కట్టి పోతుంది. రాష్ట్ర విబజన గురించి నిత్యం బండబూతులు తిట్టుకుంటూ , ఒకరి మీద మరొకరు దుమ్మెత్తి పోసుకునే రాజకీయ నాయకులు అవినీతి విషయం లో మాత్రం ఒక సీక్రెట్ అవగాహన తో మెసులుతున్నట్లు అని పిస్తుంది.

     24-11-2013 తేదినాడు, దమ్మున్న చనల్, దుమ్ము రేపే చానల్ అని చెప్పుకునే ABN  వారు రాష్ట్రం లోని కొంతమంది ప్రముఖ నాయకులు తమ వద్ద నున్న నల్ల దనాన్ని, తెలివిగా  ఎలా తెలుపు చేస్తున్నారో ,ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా సేకరించిన వివరాలను ప్రసారం చెయ్యడం జరిగింది. అది చూసి నేననుకున్నాను, ఇది రాష్ట్రం లో పెను సంచలనం స్రుష్టిస్తుందని. బహూశా చానల్ వారు కూడా అదే ఊహించి ఉండవచ్చు. కానీ ఆశ్చర్యకరంగా "సంచలనం" కాదు కదా, సమ్ చలనం కూడా లేకుండా పోయింది. దీని వలన అర్దమయింది ఏమిటంటే తెలుగు జాతి రక్తం అవినితిని సహించే స్తాయికి ఎదిగి  పోయింది. ఎవరైన అవినీతి గురించి చెపితే "ఇట్స్ కామన్ యార్" అనే స్తాయికి తెలుగు కామన్  మాన్ ఎదిగాడు. అందుకే డిల్లీలో "ఆం ఆద్మీ" గా కేజ్రీవాల్ ముందుకు రాగలిగినా, రాష్ట్రం లో పవన్ కళ్యాణ్ "కామన్ మాన్" థీం  ముడుచుకు పోతుంది. దాని బదులు "కరప్షన్ మాన్"  విజయం సాదించేటట్లు ఉన్నాడు. శబాశ్ !

      24-11-2013 తేది నాడు ABN  చానల్ వారు ప్రసారం చేసిన ఈ వీడియో ను చూడండి           




             

Thursday, December 12, 2013

AIDS కారకాన్ని ప్రోత్సాహిస్తున్న సోనియా , రాహుల్ గాందీ !

                                                               

సమాజంలో మానవ జీవనానికి విఘాతం కలిగించే దుర్నీతి , దుర్నడతలను తప్పుబట్టవలసిన అవసరం ఆ యా సమాజం లలోని మేదావులందరి పైన ఉంది. స్వలాబాలను , పార్టీల ఓట్ల కోసం సదరు దుర్నడతలను ప్రోత్సాహిస్తే దాని ప్రబావం సమాజం లోని అందరి పైన ఉంటుందనేది మేదావులు అనబడుతున్న వారు మరచి పోకూడదు .
  మొన్న సుప్రీం కోర్టు వారు స్వలింగ సంపర్కాలను నేరం గా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పు చాల మంది గే, లెస్బియన్ మేధావులను నిరాశ పరచింది. ఇదేదో తమ వ్యక్తీ గత హక్కులకు భంగం అని కొంత మంది ప్ల  కార్డులు చేత పట్టి వీదుల్లో హంగామా చేస్తున్నారు. దానికి సామాజిక కార్యకర్తల ముసుగులో కొంత మంది దీనికి వత్తాసు పలుకుతున్నారు.

ఈ  సృష్టిలో ప్రతి జీవ రాశికి ప్రక్రుతి పరమైన రక్షణలు ఉన్నాయి. అలాగే సెక్స్ లో కూడా  ప్రక్రుతి నిర్దేశించిన సహజ రతి క్రియ ద్వారా మానవుడు పునరుత్పత్తి పొందటమే కాక , సహజఆరోగ్య  రక్షణ పోందుతున్నాడు. మనిషిలో రతి సమయం లో సహజంగా ఉత్పత్తి అయ్యే కొన్ని ద్రవాలు యొక్క రక్షణ పలితాన్ని కేవలం సహజ రతి ప్రక్రియలోనే పొందగలరు. ఒక అద్యయనం ప్రకారం సహజ రతి ప్రక్రియలో కంటే అసహజ రతి ప్రక్రియ లో ఎయిడ్స్ ముప్పు 1800% ఎక్కువట! మరి ఇలాంటి ముప్పు కలిగిస్తున్న స్వలింగ సంపర్కాలను వ్యతిగత స్వేచ్చా పేరుతో మన దేశ రాణీ , యువరాజు లు అని మెజార్టీ ప్రజల చేత కొనియాడ బడుతున్న సోనియా గాందీ , రాహుల్ గాంది   గారలు , ప్రోత్సాహించడం ఎంతవరకు సమంజసం?. ప్రజల ఆరోగ్యాలకు బంగం కలిగించెట్టట్లు ఉంటే, అది  మత పరమైన హక్కులైన సరే నియంత్రించవలసిందే అని భారత రాజ్యాంగం చెపుతుంది. మరి మన  దేశం లో ఉన్న కొద్ది మంది గే , లెస్బియన్ ల కోసం మెజార్టీ ప్రజల ఆరోగ్యాలకు  కీడు తెచ్చే స్వలింగ సంపర్క సంస్కృతిని ప్రోత్సాహించడం , కొంతమంది మేదావులనబడే వారిలోని అజ్ఞానానికి ప్రతీక అనుకోవచ్చా!?

      ఇదే విషయం పై మరింత సమాచారం కొరకు చూడండి http://www.aidsmap.com/HIV-transmission-risk-during-anal-sex-18-times-higher-than-during-vaginal-sex/page/1446187/

Wednesday, December 11, 2013

"గృహ హింస నిరోదక చట్టం" మొగుళ్ళు చావుకొస్తే , మరి "మత హింస నిరోదక చట్టం " ఎవరి చావు కోసం?

                                                             


ఈ  దేశాన్ని విదేశి సంస్క్రుతి యే ఏలుతుంది. తమ పార్టీ వోట్ల కోసం కొన్ని వర్గాల ప్రజలని నిరంతరం బయపెడుతూ , వారి రక్షణ కోసం ఎదో ఒక పనికి మాలిన చట్టం చేస్తూ , తాము మత్రమే సదరు వర్గాల ప్రజల రక్షణకు కంకంణం కట్టుకున్న వీరాది వీరులమని కుహన లౌకిక వాదులు ప్రజలను నమ్మించ చూస్తున్నారు.
ఇప్పటికే కొన్ని వర్గాల రక్షణకు ఉద్దేసించిన చట్టాలు 95% దుర్వినియోగమై , ప్రజల మద్య ఒక కాన రాని విభజన రేఖ ఏర్పడుతూ , ఏ వర్గ రక్షణ కైతే చట్టాలు చేయబడ్డాయో , అ వర్గపు ప్రజలను మిగతా ప్రజలకు దూరం చేస్తున్నాయి అనడం లో అతిశయోక్తి ఏమి లేదు. ఇప్పుడు చాలా  మంది కొన్ని వర్గాల ప్రజలతో స్నేహంగా ఉండడానికి బయపడుతున్నారు. వారితో డబ్బు లావాదేవీలు లాంటివి నడపడానికి ససేమిరా ఒప్పుకోవటం లేదు. వారికి తమ వద్ద ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా వారికి భయం పుడుతుంది. ఒక్కప్పుడు మన సమాజంలో కొన్ని వర్గాల వారిని అంటరాని వారిగా పరిగణించి వారిని అవమానించారని, అలాంటి చర్యలు నాగరిక సమాజం లో కూడదనే ఉద్దేశ్యం తోనే వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు తెచ్చిన మాట నిజమే అయినా, ఆ చట్ట నిర్మాణం లో కొన్ని  జాగర్తలు తీసుకోక పోవటం వలన చివరకు ఆ చట్టం అమలులో 95% దుర్వినియోగమై తప్పుడు కేసులు పెట్టి ప్రత్యర్దులను హింసించడం ఒక లాభ సాటి వ్యాపార మయ్యే సరికి , సామాన్యుడు ఏమి చెయ్య లేక చివరకు ఆ వర్గ ప్రజలకు దూరంగా ఉండదమే మంచిదనే నిర్ణయానికి వచ్చాడు. ఏ అంటరాని తన్నాన్ని ప్రజల మద్య రూపు మాపాలని చట్టం చేసారో , ఆ అంట రాని  తనం ని ఎక్కువ చెయ్యడం లో ఆ చట్టం దోహదపడింది. కాకపోతే ఒకటే తేడా! ఆ నాడు కనపడే అంటరాని తనం, ఈ  నాడు కనిపించని అంట రాని తనం.

 ఇక పోతే గృహ హింస చట్టం తెచ్చిస్త్రీలకు లకు రక్షణ పేరుతో , భర్తలను, వారి కుటుంబ సబ్యులను హింసిస్తూ , వారి ఆత్మ హత్యలకు కా రణమవుతుంది. ఈ  చట్టం కూడా  ఆచరణలో దారుణంగా అంటే 95% విపలమై , కొంతమంది స్త్రీలు అంటే పురుషులు బయపడి పోయే స్తితిని కల్పించింది. నిజమయిన బాదిత స్త్రీలు ఈ చట్టం వలన రక్షణ పోందింది తక్కువ అనేది గణాంకాల వలన అర్దమవుతుంది. దీని పుణ్యమా అని ఎన్నడూ  లేని విదంగా పురుష హక్కుల సంఘాలు ఏర్పడ్డాయి అంటే పరిస్తితి ఎంత ఘోరంగా ఉందో అర్దం చేసుకోవచ్చు!

 ఇక ఇప్పుడు మత  హింస నిరోదక బిల్లు పేరుతో మైనార్టీల రక్షణకు బిల్లు తేవాలని తెగ ఉబలాట పడుతుంది సోనియా గాంది  గారి  ప్రభుత్వం . ఒక వేళ ఇది వస్తే ఇక మైనర్టీలను" ఎం బ్రదర్ బాగున్నవ్వా" అని కూడా పలకరిమ్చ లేక ఫొవచ్చు. హిందువుల నమ్మకాలను ఎవరైనా ప్రశ్నించవచ్చు, కాని మైనర్టీల అశాస్త్రీయ బావనలు ఎవరూ ప్రశ్నించ లేక ఫొవచ్చు. ఎందుకంటే వారు మానసికంగా గాయపడతారు కాబట్టి. అదీ పరిస్తితి ! పాపం హిందువులది ఎంత దయనీయ పరిస్తితి? ఇటువంటి దిక్కు మాలిన చట్టాలను సమర్దించే వారికి ఎన్నికలలో బుద్ది  చెప్ప లేక పోతే మన దేశం లో మన సంస్కృతిని కాపాడుకోలేని దీన స్తితిలో ఉండడం ఖాయం.

Friday, December 6, 2013

సోనియా గాందీ పుట్టిన రోజు సీమాంద్రా కాంగ్రెససోల్ల చావు కొచ్చింది!

                                                 
 
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది అని సామెత! అచ్చం  అలాగే ఉంది, సోనియా గాందీ పుట్టిన రోజు కహాని . డిసెంబర్ 9 ని సీమాంద్రా ప్రజలు ముఖ్యంగా సీమాంద్రా కాంగ్రెస్ నాయకులు మరచిపోలేని దినం గా మారనుంది. ఎందుకంటే ఆ రోజు వలనే తాము నమ్ముకున్నకాంగ్రెస్  పార్టీ కి సీమాంద్ర ప్రజలు గోరి కట్టడానికి కారణ మవుతుంది! తెలివిగా తమిళ తంభి  చిదంబరం K.C.R  గారి చేత నిరాహార దీక్ష చేయించి ఆమె జన్మ దిన కానుకగా పొందిన వరం "తెలంగాణా రాష్ట్రం" . కా బట్టి నాలుగేళ్ళ క్ల్రితమే తెలుసు శ్రీ మాన్ చిదంబరానికి మరియు K.C.R  గారికి, తెలంగాణా ఎట్టి పరిస్తితుల్లో ఆగదని. తెలంగాణ ఇవ్వడం లో సోనియా గాంది కి ఉన్న ఇంట్రస్ట్ కేవలం తన పుట్టిన రోజు కానుకగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడమే తప్ప , వేరే రాజకీయ ఆసక్తులు ఆమెకు లేక పోవచ్చు. ఎందుకంటే ఆమె రాజకీయ పరంగా ఆమెకు ఉన్న జ్ఞానం నిల్  కాబట్టి.

   కానీ చిదంబరానికి మాత్రం ఈ  విషయం లో గట్టి పట్టుదలతో  ఉన్నాడని నిన్న జరిగిన ఉదంతం కూడా తేట తెల్లం చేస్తుంది. నిన్న కేంద్ర కాబినెట్ లో టేబుల్ ఐటం గా తెలంగాణా మీద గ్రూప్ అప్ మినిస్టర్స్ నివేదికకు ఆమోదం తెలిపే ప్రక్రియ చేపట్టాకా , మన రాష్ట్ర మంత్రులు అయిన పల్లం రాజు, కావూరి "ఇది అజెండా లో లేకుండా టేబుల్ ఐటం గా ప్రవేశ పెట్టారు కాబట్టి , విషయ అవగతం కు ఒక 2 రోజులు టైం  ఇవ్వండి " అని అడిగితే ప్రదాన మంత్రి గారు O.K  అన్నారట! కానీ వెంటనే చిదంబరం గారు కలుగ చేసుకుని "అదంతా కుదరదు, వెంటనే ఆమోదం తెలపాల్సిందే" అనే సరికి , రాష్ట్ర మంత్రులు ఇద్దరూ లేచి బయటకు వచ్చేశారట! కాబట్టి 2014 లోపు తెలంగాణా ఏర్పాటు అనేది చిదంబరం "చింత" లో నుంచి పుట్టి, సోనియా పుట్టిన రోజుకు ముడి పెట్టి , అది త్వరిత గతిన సాదించడంలో సక్సెస్ అయ్యడు.

 ఈ  కుట్ర తెలియని సీమాంద్రా నాయకులు ఏమి జరగదు అనే దీమాతో ప్రతి దానికి తల ఆడించి, ప్రజల అభిప్రాయాన్ని సోనియా గాంది కి చెప్పకుండా , తెలంగాణా అంటే తమకు అబ్యంతరం లేదని చెప్పడం వల్లే , రాష్ట్ర ఏర్పాటు సాధ్య పడింది. ఇప్పటికి వారు తమ తప్పు తెలుసుకోకుండా ప్రజలను మబ్య పెడతానికే చూ స్తున్నారు. కేంద్రం లో అద్ కార కాంగ్రెస్ , ప్రతిపక్ష B.J.P  తెలంగాణా కు O.K  అన్నాకా , ఇక బిల్ ఆమోదం పొందడమనేది నల్లేరు మీద నడక. అవసరమైతే రాజ్యంగ సవరణకు కావాల్సిన 2\3 మెజార్టీ ఉంది కాబట్టి పార్ల మెంట్ లో బిల్లు పెడితే నెగ్గడం ఖాయం. ఈ  విషయంణ్ లో కాంగ్రెస్ వారికి, B.J.P  వారికి ఒక అవగాహన ఉందనడానికి నిదర్శనం నిన్న "రాయల తెలంగాణా" ప్రతిపాదన నుండి కేంద్ర మంత్రి వర్గం డ్రాప్ అయి 10 జిల్లాల తెలంగాణాకు ఆమోద ముద్ర వెయ్యడమే!

   కాబట్టి తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు అనేది సీమాంద్రా  రాజకీయ నాయకులు నిర్లక్ష్య దోరణీకి , మితిమీరిన విశ్వాసానికి , అమ్మకు ఎదురు చెప్పలేని చేతకాని తనం వలననే సాద్యపడింది. దీనికి తెలంగాణా నాయకులూ వారికి థాంక్స్ చెప్పాలి మరి! ఇదే విషయం మీద ఇదే  బ్లాగులో నేను చెప్పిన విషయం ఎలా నిజమయిందో చూడండి

(నాన్నా "తెలంగాణా" వచ్చే!http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html)

Sunday, December 1, 2013

"సువ్వర్ కా బచ్చా " అనేదే మనిషికి కరెక్ట్ అంట!

                                                            


శాస్త్ర విజ్ఞానం , శాస్త్ర విజ్ఞానం అని మనం సైంటిస్టులు చెప్పే దానిని ప్రామాణికంగా తీసుకుంటున్నాం. కానీ వారు మొన్నటి దాక మనిషి "కోతి" నుండి పరిణామ క్రమం లో అభివృద్ధి చెందిన వాడు అంటే సరేలే "బందర్ కా బచ్చా " అనేగా అంటున్నది అని ఊ రుకున్నారు . కానీ ఇప్పుడేమో కాదు, కాదు మనిషి కోతినుండి అభివృద్ధి చెందిన వాడు కాదు, వాడు ఆడ చింపాంజీకి , మగ పందికి పుట్టిన అక్రమ సంతానం అని సెలవిచ్చాడు ఒక సైంటిస్ట్. అమ్మా ! ఎంత పని జరిగింది! చివరకు మానవ జాతీ అంతా  అక్రమ సంతానం అయి పోయిందన మాట!

   ఈ మాత్రం కనిపెడతానికి సైంటిస్ట్ లకి ఇన్నాళ్ళు పట్టింది. అదే విషయాన్ని మనలో కొంతమంది పెద్దలు ఏనాడో చెపితే ఎవరైనా పట్టించుకున్నారా? కాకపోతే వారు తిట్ల రూపం లో చెప్పారు . వీరేమో శాస్త్రీయంగా చెపుతున్నాం అంటున్నారు అంతే తేడా! పెద్దలు పిల్లల్ని తిట్టే తిట్లలో "పంది నా .... ! అని సువ్వర్ కా బచ్చా అని అనడం వింటుంటాం. అంటే తమకు తెలియకుండానే తమ మూల పురుషుణ్ణి స్మరిస్తున్నారు అన్నమాట!

   చర్మ కణాలు, గుండె తాలూకు వాల్వ్స్లలక్షణాలు  పందికి మనిషికి ఒకటే నంట. ఆకారం, ఇతరత్రా చింపాజీకి దగ్గర పోలికలు కలిగి ఉంటాడు మనిషి. మనిషిలో తమ పూర్వీకుల  లక్షణాలు ఉండి తీరతయి కాబట్టి , ఈ  రెండు లక్షణాలు మనిషిలో ఉంటానికి కారణం వాటి మద్య ఎప్పుడో జరిగిన అక్రమ సంపర్కమే అని అమెరికన్ సైంటిస్ట్ Eugene McCarthy అనే అయన సిద్దాంతం అనుకుంటా . అయన ఏమి చెప్పాడో పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ  క్రింది లింక్ ని క్లిక్ చేసి చూడవచ్చు. 

   పంది అంటే కొంతమందికి యమ అసహ్యం. హిందువులు విష్ణువుని  "వారాహ మూర్తి" గా పూజిస్తారు కాబట్టి వారికి పర్వాలేదు కానీ , పంది అంటే అసలు పడని వారు ఈ సిద్దాంతాన్ని కోడా అసహ్యించుకుంటారు అనుకుంటా! ఏదైనా పెద్దల తిట్లు దీవెనలే కాదు , సైన్స్ సిద్దాంతాలు కూడా  అన్నమాట! http://www.dailymail.co.uk/sciencetech/article-2515969/Humans-evolved-female-chimpanzee-mated-pig-Extraordinary-claim-American-geneticist.html