Friday, August 30, 2013

ఇండియన్ మదర్ కన్నది అహ్మద్ సిద్దిబప్పానయితే, మదర్సా చదువు మార్చింది యాసిన్ భత్కల్ గా!


                                                                      


   యాసీన్ భత్కల్! ఒక నరరూఫ రాక్షసుడు. వీడికి కులం లేదు. మతం లేదు సరి కదా అసలు మానవత్వం అనేది మచ్చుకైన కానరావు వీడిలో . దేశంలో వివిద ప్రాంతాలలో జరిగిన   బాంబు  ప్రేళ్ళుల్లకు మాస్టర్ మైండ్ భత్కల్. అట్టి నర రూప రాక్షసుడు నిన్న ఇండియా నేపాల్ సరి హద్దుల్లో పోలిసులకు పట్టుబడటం జాతికి ఆనందం కలిగించే విషయం.

 యాసిన్ భత్కల్ అసలు పేరు అహ్మద్ సిద్దిబప్పా. ఇతడు ఉత్తర కర్ణాటక లోని భత్కల్ ప్రాంతానికి చెందిన వాడు. చిన్నప్పుడు' అంజుమన్ ఆమీన్ ఏ ముస్లీమీన్' అనే మదర్సాలో విద్యాబ్యాసం చేసాడు. ఆ తర్వాత దుబాయి వెళ్ళి తండ్రి నడుపుతున్న బట్టల కొట్లో పని చేసాడు. ఇతని లోని తివ్రవాద దోరణిల వల్ల తండ్రి తో సరిపడక అక్కడ నుండి ఇండియాకు వచ్చి ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్తను స్తాపించి దేశం లోని వివిద ప్రాంతాలలో బాంబు పేళ్లుల్లు జరిపి ప్రజలను హత మార్చాడు. ఒక సారీ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అయినా పోలిసుల కళ్ళు కప్పి తప్పించుకున్నాడట!

ఇంటిల్జెన్స్ వర్గాల సమాచారం మేరకు  2008  నుండి ఇప్పటి వరకు యాసిన్ భత్కల్  బాంబు పేళ్లుల్లు జరిపిన ప్రాంతాలు.అహ్మదాబాద్    (2008), సూరత్  (2008), జైపూర్ (2008), న్యూ డిల్లీ (2008), వారణాసి (2010),బెంగళూర్  (2010), ఫునె (2011),ముంబై  (2011), హైదరాబాద్  (2013) బెంగళూర్  (2013).

  ఇప్పటికైన ఈ క్రూరుడిని పట్టుకోవడం సంతోషం. త్వరలో మిగతా ఉగ్రవాదులని కూడా పట్టుకుని ఉగ్రవాదుల  నుండి దేశాన్ని కాపాడతారని ఆశిద్దాం. 

Thursday, August 29, 2013

తెలుగోడి రాష్ట్రంలో ఎవడి గోడు వాడిదే !

                                                     


                                                            
ఏమంటూ ప్రకటించారో కానీ, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు, ఆ రోజు నుంచి రాష్ట్రంలో  రాజకీయ నాయకులకు హడావుడి ఎక్కువైపోయి పాపం కంటి మీద కునుకు లేకుండా పోయినట్లుంది. మొన్నట్టిదాక రాయల సీమ నేతలు, ముస్లిం నేతలు "రాయల తెలంగాణా" ప్రతిపాదనతో, రాయలసీమ జిల్లలను తెలంగాణ లో కలిపి రాష్ట్ర ఏర్పాటు చెయ్యాలని ముందుకు వస్తే,ఇప్పుడు కొంతమంది నాయకులు ఉత్తరాంద్ర జిల్లాలతో కలిపిన తెలంగాణా కావాలని ప్రతి పాదిస్తున్నారు. దీనికి ముఖ్యంగ రేణుకా చౌదరి గారు, ప్రభుత్వ విప్ బట్టీ విక్రమార్క, కోండ్రు మురలి గారు ప్రతిపాదన చేసి ఉత్తరాంద్రా నాయకులను కల్పుకుని డిల్లీలో తమ ప్రతిపాదనను సోనియా గాంది గారికి వివరించలనుకున్నట్లు తెలుస్తుంది. రేణుకా చౌదరి గారికిమేడం గారితో ఉన్న సన్నిహితం ఆమెను ప్రబావపరచడనికి ఉపయోగ పడినా , ఈ ప్రతిపాదనకు నాయకులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు .

 ఆసలు ఈ ప్రతి పాదన వెనుక ఉత్తరాంద్రాలోని కొన్ని మైనింగ్ ఆదారిత కంపెనీల యాజమాన్యాలు హస్తం ఉన్నట్లు కనపడుతుంది .ఖమ్మం జిల్లాలోని ఇనుపరాయి,ఇతర ఖనిజాలు విశాఖ పట్టణం, విజయనగరం లోని ప్లాంట్లకు సరపరా చేస్తుంటారు. అలాగే మన్యసీమలో ఎంతో విలువైన ఖనిజ సంపద ఉత్తరంద్రా జిల్లలోని కంపెనీలకు అవసరం. రేపు తెలంగాణా విడిపోతే ముడి ఖనిజం లబ్యత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పటికే బయ్యారం ఇనుపరాయి విశాఖా స్టిల్ ప్లాంట్ కి కేటాయించడాన్ని తెలంగాణ వాదులు ఒప్పుకోవడం లేదు. ఇలాంటి సమస్యలు ఏర్పడకుండా  ముందు చూపుతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగ కంపెనీలు రాజకీయ నా యకులతో ఈ ప్రతిపాదన చేయిస్తూ ఉండవచ్చు.

  ఇంకా సీమాంద్ర ప్రజలలో తెలంగాణా రాష్ట్ర ఏర్ప్పాటు ఎట్టి పరిస్తితిలో జరగదని నమ్మకం. అందుకే సమైక్యత మీదే వారి ద్రుష్టి నిలిపారు. ఒకవేళా ఆరు నూరైనా రాష్ట్రం విడిపోవడం ఖాయమని వారు కూడా అనుకుంటే అప్పుడు చూడాలి ఎన్ని ప్రతిపాదనలు వస్తాయో.  రాష్ట్రం లో రాజకీయాలు,ఎవడి గోల వాడిదే అన్న ట్లు ఉంటాయి.  

Wednesday, August 28, 2013

ఏమిటీ ! హైదరాబాద్లో మీకు రక్షణ లేదా ? ఇదిగో నా పోన్ నంబర్ తీసుకోండి .ఎనీటైం .... ఎనీవేర్ .... మీకు రక్షణ ఇవ్వడానికి నేను రెడీ !

                                                             

 తెలంగాణా ఏర్పడితే , నూతన రాష్ట్రం లో త్రెలంగానా నిరుద్యోగులకు   ఏటువంటి ఉద్యోగాలు వస్తాయో  తెలియదు కానీ రాజకీయ నాయకులకు మాత్రం సెక్యూరిటి గార్డులు , బాడి గార్డుల ఉద్యోగాలు మాత్రం బోల్డన్నీ వచ్చేటట్ట్లున్నాయి . ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు , లాండ్ మాఫియా  డాన్ లు తమ ఆసక్తులు ,ఆస్తులు రక్షణకు  బీహారీ  గాంగ్ లను నియమించుకున్నారంట . అలాగే రేపు తెలంగాణ ఏర్పడితే హైద్రాబాద్లో ఉన్న సీమాంద్రా సెటిలర్స్ తమకు రక్షణ ఎలా అని ఆందోళన పడుతున్న నేపద్యమ్ లో తెలంగాణా రాజకీయ నాయకులు పోటీలు పడీ మరీ మీడియా ప్రకటణ లు ఇచ్చేస్తున్నారు  మరి !

 తెలంగానా  రాష్ట్రం ఏర్పడితే సీమాంద్రుల సెటిలర్స  ఆస్తులు, వ్యక్తిగత రక్షణ,    సమస్యగా మారుతుందని సీమాంద్రులు బయపడడానికి   కారణం తెలంగానా ప్రాంత నాయకుల రెచ్చగొట్టే మాటలు..  దానికి సెటిలర్స్ రక్షణ గురించి, వారు అడుగుతుంది ప్రత్యేక  చట్ట రక్షణ, ప్రభుత్వ రక్షణ. అంతే కానీ తెలంగాణా రాజకీయ నాయకుల ఇచ్చే వ్యక్తిగత లేక సామూహిక హామీలు కావు. ఒక వేళా తెలంగాణ నాయకులు బాడీ గార్డులు గా రూపాంతరం చెంది, సెటిలర్స్ కి రక్షణ ఇస్తామన్నా, వారి సేవలు పొందడానికి ఏ సెటిలర్ సిద్దంగ లేడు. ఆసలు సెటిలర్లు బయపడేది తెలంగాణ రాజకీయ నాయకులకే తప్పా, తెలంగాణ లోని సామాన్య  ప్రజలకు కాదు. తెలంగాణా ప్రజలు, ఆంద్రా ప్రజల మద్య ఉన్నది సోదరబావమే తప్పా వేరే అనుమానలు ఏమి లేవు. వచ్చిన సమస్యల్లా రాజకీయ నాయకులతోనే.  N.T.R  వచ్చే దాక హైద్రాబాద్ లో మత ఘర్షణలు ఆపిన  వాడే లేడు . అసలు వాటిని పెంచి పోషించింది రాజకీయా నాయకులే అనేది జగమెరిగిన సత్యం.మరి అటువంటి నాయకులు "మా పోన్ నంబర్ తీసుకోండి. మీకెవరైన ఆపద కలిగిస్తే మాకు పోన్ చెయ్యండి. మీ ప్రాణాలకు మా ప్రాణాలు  అడ్డం" అని సినిమా డైలాగులు కొడుతూంటే తెలంగాణ వారికే అనుమానం వస్తుందట! ఇదేంట్రా బాబూ, వీరేదో తెలంగాణా  రాష్ట్రం తెచ్చి, మనకు ఉద్యోగాలు ఇప్పిస్తారు అనుకుంటే, సీమాంద్రులకు బాడీ గార్డులుగ పని చెయ్యడానికి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఇలా ప్రకటణలు ఇస్తున్నారేమిటా? అని.

 కానీ సదరు రాజకీయ నాయకుల ఇంట్లోని ఆడవాళ్ళు మాత్రం తమ మగవారి మాటలను మాత్రం అస్సలు పట్టించుకోవటం లేదట! ఆ.. ఈళ్ళ బొంద! మా మెళ్ళల్లో గొలుసులని పట్టపగలే దోచుకు వెళుతున్న  వారి నుండి ఇంటి వస్తువులు కాపాడ లేరు కానీ, ఇక సేటిలర్స్ ఆస్తులును కాపాడతారా? అని. కానీ పాపం ఇదేమి తెలియని సదరు నాయకులు మత్రం బాడిగార్డ్ గిరి  చెయ్యడానికి యమ హూషార్  అవుతునారంట !     

Tuesday, August 27, 2013

వ్యక్తుల్ని బౌతిక వాద పద్దత్తుల్లోనే కాదు , బావోద్వేగ పద్దత్తుల్లో కూడా చంపవచ్చు, జన విజ్ఞానుల వారూ

                                                                  
ప్రముఖ హేతువాది శ్రీ నరేంద్ర దబోల్కర్


  మొన్న నేను ఫేస్ బుక్ లో ఒక మిత్రుడు పెట్టిన టపా చూసాను . ఆయనగారి వ్యాఖ్యానం నాకు కొంచం ఆశ్చర్యాన్ని తెప్పించింది . పూర్తీ వ్యాఖ్యానం ఇది

 "ఇది భౌతిక వాద శక్తులు సాధించిన విజయం. మతోన్మాదులార భౌతిక వాదులను చంపాలంటే భౌతిక పద్దతుల్లోనే హత్య చేయాలి తప్ప ఏ భావ వాద పద్దతుల్లో చంపడం సాధ్యం కాదు అని నిరుపించిన గొప్ప వ్యక్తి నరేంద్ర ధబోల్కర్. బాణామతి, చేతబడులతో కాని, మంత్రాలు, మాయలతో కాని మమ్మల్ని చంపలేరనేది నిజం అనే బౌతిక సత్యాని నిరుపించినది ధబోల్కర్ గారి మరణం.

ఇప్పుడే నరేంద్ర ధబోల్కర్ గారి సంస్మరణ సభలో మాట్లాడి వస్తున్న. నిజంగ 8సం. క్రిత
ం ఫొన్ లో పరిచయమై అప్పుడప్పుడు ఆప్యాంగా మట్లాడి సలహాలు ఇచ్చే వ్యక్తి, నేను అభిమానించే వ్యక్తి చని పోవడం ఆ సభలో మాట్లాడాల్సి రావడం చాలా కష్ట సాధ్యమైన పనే. ప్రస్తుత ఐ.జి. ఆనాటి నల్గొండ ఎస్.పి. మహేష్ భగవత్ గారు నాకు నరేంద్ర గారిని పరిచయం చేశారు. అంధ శ్రద్ద ఈర్మూలన సమితి మూఢ నమ్మకాలకు వ్యతిరెకంగ, మోసాలు చేసే స్వాములు, బాబాలను అరెస్ట్ చేసె చట్టం ఒకటి చేయాలని పోరాడుతున్న ఆ మహానుభవుడి నుండి ఆ చట్టం కాపిని తెప్పించుకుని దానిని ఇక్కడ కూడా అమలు చేయాలని కోరాలని అనుకోవడం జరిగింది. అప్పటి నుండి అప్పుడప్పుడు నరేంద్ర గారితో మాట్లాడుతునే ఉన్నాను. మతోన్మాద శక్తులు ఎంతకైన తెగిస్తాయని చెప్పడానికి ఇది నిదర్శనం.    "J.V.V. Ramesh". 


 కొంతమంది దుండుగలు ప్రముఖ హేతువాది దబోల్కర్ గారిని హత్య చేసారు . ఇది  పిరికి పందల  చర్య . ఇటువంటి దుర్మార్గపు చర్యలను బౌతిక వాదులే కాదు బావ వాదులు కూడా  ఖండించారు, ఖండించాలి కూడా  . కానీ అయన హత్య చేయబడటం బౌతికవాదుల విజయం అంటే కొంచం ఆశ్చర్యంతో కూడిన అనుమానం వస్తుంది . కొంపదీసి తమ వాదాన్ని గెలిపించుకోవటం కోసం బౌతిక వాదులే ఆయన్ని హత్య చేయించారా అని ! లేకపోతే హత్యలో కూడా  బౌతికవాద  గెలుపు చూడటం ఏమిటీ ? 
  ఒక వేళా జన విజ్ఞాన వేదిక వాదన ప్రకారం హత్యలన్నీ బౌతిక వాదుల విజయాలు అయితే ఆత్మ హత్యలన్నీ బావవాదుల విజయాలు అవుతాయి . ఎందుకంటే  బావోద్వేగాలే ప్రదాన పాత్ర వహిస్తాయి కాబట్టి . మొన్నట్టివరకు జరిగిన తెలంగాణా ఉద్యమంలో వేయిమందికి  పైగా ఆత్మ హత్యలు చేసుకున్నారు . ఇప్పుడు సమైక్యతా ఉద్యమంలో నాలుగువందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారట ! మరి ఇవ్వన్నీ బావవాదుల విజయమని వారు చంకలు ఎగురవేస్తే ఎలా ఉంటుంది ? కాబట్టి మిత్రులు హత్యను హత్యగానే చూడాలి తప్పా , అందులో గెలుపు ఉందని బావించడం శవయాత్రలో చిల్లర పైసలు ఏరుకునే నైజం లాంటిది . 

  దేశమంటే మట్టి కాదోయి మనుషులోయి అన్నట్లు , మనిషి అంటే  శరీరం మాత్రమే కాదూ ., బావోద్వేగాల సమ్మేళనం కూడా   అని తెలిసికుంటే మంచిది . .మెదడులో ఎడమ బాగం తప్పా , కుడిబాగం పనిచెయ్యని వారికి ఎంత చెప్పినా బుర్రకెక్కదు కాబట్టి వారిని చూసి జాలిపడటం తప్పా మనం చేయగలిగింది ఏముండదు ..

  .

 
 

Monday, August 26, 2013

ఈ రోజు ఆహార భద్రతా బిల్లు పాసయింది కాబట్టి, రేపటినుండి తెలంగాణా వాదుల దౌర్జన్యం అణచి వేస్తారంట !

                                                                     

 ఆహార బద్రతా బిల్లుకి తెలంగాణా వాదుల దౌర్జన్యాల అణచివేతకి సంబందం ఏమిటని ఆశ్చ్యర్యపోతున్నార! ఏమో మరి, ఇందాకా టి.వి.లో ఉండవల్లి గారి మీడియా ప్రకటణ చూసి నాకు డౌట్ వచ్చింది.

   ఈ సాయంత్రం సీమాంద్రా నాయకులు ఆంటోనీ కమిటిని కలిసారు. కలిసి హైద్రాబాద్ లో సీమాంద్ర ఉద్యోగుల మీద, లాయర్ల మీద తెలంగాణా వారు రౌడీలు  లాగ దౌర్జన్యం చేస్తునారని, తెలంగాణ కావాలనే హక్కు వారి కెంత ఉందో, సమైఖ్యంద్రా ఉండాలనే హక్కు, తమకూ అంతే ఉందని, కాని దానీ కోసం శాంతియుతంగా నిరసనలు చేస్తున్న సీమాంద్రా ఉద్యోగులు మీద తెలంగాణ వారు దాడి చేస్తున్నా,  ప్రబుత్వం తగిన చర్యలు తీసుకోవటం లేదని, దీని వలన సీమాంద్రులలో అబద్రత బావం పెరిగి చివరకు లా అండ్ ప్రాబ్లం ఎక్కువయ్యే అవకాశం ఉందని మొర పెట్టుకున్నారట. దీనికి సానుకూలంగా స్పందించిన ఆంటోని గారు, దిగ్విజయ్ సింగ్ గారి చేత ముఖ్య మంత్రి గారికి ఇతర అధికారులకు పోన్ చేసి తగిన చర్యలు తీసుకోమని చెప్పారట! ఈ విషయాన్ని ఉండవల్లి గారు మీడియా ముందూ వెళ్ళడిస్తూ రేపటినుండి చూడండి ఎలా ఉంటుందో అని నర్మగర్భంగ అంటుంటే నాకు ఒక  సందేహం వచ్చింది.

  నిజంగా సీమాంద్రా నాయకులకు తెలంగాణా వారి చేష్టల మీద అబ్యంతరం ఉంటే, అప్పుడే ఆంటోణి కమిటీకి ఈ విషయం చెప్పి వారికి తగిన రక్షణ ఏర్పాటు చేయ్యమని అడిగి ఉండవచ్చు కదా! ఇప్పట్టి దాక ఇరువర్గా ల మద్య తోపులాటలు అదీ ఫ్రేండ్లీ గేమ్ లాగా జరిగిందే తప్పా, ఒకరికీ  దెబ్బలు తగిలిన దాఖలాలు  లేవు కదా! ఇదంతా , చూసే వారికి పనులు ఎగ్గొడతానికి ఇరువైపుల ఆడే డ్రామాలాగ అనిపిస్తుంది తప్పా, పెద్ద సీరియస్ నెస్ ఏమి కనిపించలేదు వారి తోపులాటలో! మరి ఇంతలో ఈ సిరియస్ అలేగేషన్ ఎందుకబ్బా !ఒహో అంటే ఈ రోజు ఆహార భద్రతా బిల్లు ఒడ్డెక్కింది కాబట్టి, ఇక నుండి హైద్రాబద్ ని కేంద్ర పాలిత ప్రాంతం గా చెయ్యడానికి అవసరమైన అన్ని చర్యలు మొదలు పెట్టాలని సీమాంద్రా నాయకులు నిర్ణయించి ఉంటారు. దానికి కావల్సిన రిహార్సల్ కి రంగం సిద్దం చేసుకుంటునారు అన్న మాట. కానియ్యండి, కానియ్యండి. ఇంకా తెలుగు ప్రజలు  ఎన్ని డ్రామాలు చూడాల్సి ఉందో! రాజకీయ నాయకులు ఎన్ని నాటకాలు ఆడాలనుకున్నా,చివరకు పైనున్న వాడు ఏది నిర్ణయిస్తాడో అదే జరుగుద్ది అని తెలుగు ప్రజలు చూస్తున్నారు. పాపం!    

Saturday, August 24, 2013

"సందట్లో సడే మియా" ప్రతి పాదన ఎందుకోసం?


                                                                     


   ఒక వ్యక్తి కాని, కుటుంబం కాని బలంగా ఉన్నంత కాలం ఎవడూ మాట్లాడడానికి కాని, వారితో విబేదించడానికి కాని సాహాసం చేయరు.కాని అదే వ్యక్తి కాని, కుటుంబంకాని ఏ కారణాలచేతనైన బలహీనమ పడుతున్నపుడు ప్రతి ఒక్కరూ దాని నుండి ఫాయిదా పొందాలని చూస్తారు. ఇదే పద్దతి ప్రస్తుతం తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతుంది.

   ఇప్పటి దాక రెండే వాదాలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో వినిపిస్తుండేవి. ఒకటి ప్రత్యేక తెలంగాణా, రెండు సమైఖ్యతాంద్రప్రదేశ్. తెలంగాణా కోసం మొన్నట్టిదాక తెలంగాణా ప్రజలు పెద్దఎత్తున ఉద్యమిస్తే, రాష్ట్ర ఏర్పాటుకు అధికార పార్టీ అంగికరించగానే ,జై సమైక్యాంద్రా అంటూ సీమాంద్ర ప్రజలు ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం నడుస్తున్న తీరు చూస్తే, సీమాంద్ర ప్రజలలో బావోద్వేగాలతో కూడిన మమకారం మన రాజదాని నగరం మీద చాలా ఎక్కువుగానే ఉందనిపిస్తుంది. కానీ సోనీయా గాంది గారు విబజన తప్పదు అని కరాఖండిగా చెపుతుంటే సీమాంద్ర కాంగ్రెస్ నాయకులకు ఎటూ పాలుపోక కొంతమంది  నష్ట నివారణ కోసం ఆలోచించడం మొదలు పెట్టారు. దానిలో బాగమే "హైద్రాబాద్" ని కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యడం. ఈ గొడవలు ఇలా ఉంటే ఇంకొక ప్రతిపాదన తెచ్చాడు "సందట్లో సడేమియా".

    సందట్లో సడే మియా అని ఎవరిని అంటారో తెలుసా? ఎవరి గొడవలో వారు టెన్షన్ పడుతుంటే  గప్ చుప్ గా  తన పని కానిచ్చుకునే వాడిని అంటారు. ఇదిగో అలాంటి సడే మియా ఒకరు తయ్యారయ్యారు. ఆయనకి అధిష్టాన దేవత దగ్గర పలుకు బడి ఎక్కువట. అధిష్టాన దేవతకు బి.జె.పి. అంటే ఎలాగు పడదు.  అందుకని నూతనంగా ఏర్పడబోయే తెలంగాణా రాష్ట్రం లో బి.జె.పి. బలపడకుండ, మరియు ముస్లిం ల సీట్లు గణనీయంగా పెంచుకునేందుకు, "రాయల తెలంగాణా" ప్రతి పాదన మొదలుపెట్టి అమ్మ కు విన్నవించాడు.దీనికి కొంతమంది సీమ నాయకుల మద్దతు ఉందని చెపుతున్నారు. ఈ విదంగా  అటు  సీమాంద్రలోను విభజన తేవడానికి ఈ "సడే మియా" ప్రయత్నిస్తున్నాడు. రాయసీమ ప్రాంతం లో ముస్లిం ల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. మొన్న శుక్రవారం సమైఖ్యతాంద్ర ప్రదేశ్ కోసం సీమ ముస్లిమ్లు ప్రత్యేకంగా ముస్లిం J.A.C   పేరుతో ఆందోళన చేస్తే లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చారు. అందుకే సీమ ముస్లిం లు, తెలంగాణా ముస్లింలు కలిస్తే తెలంగాణాను  మరొక సారి నవాబుల రాజ్యం చేయవచ్చని వారి ఆశ కాబోలు. మైనార్టిలుగా ఉండబట్టి వారిలోని కాంక్ష బయటపడటం లేదు కానీ, లేకుంటే హైద్రాబాద్ నిజాం లది కాబట్టి దానిని ఏలే హక్కు మాదే అనే కొంత మంది  చెంగీఝ్ ఖాన్ లు బయటపడే వారే.

  ఒక వేళ సడేమియా గారు ఆశించినట్లు రాయల తెలంగాణ వస్తే ఖచ్చితంగ అది మత పరమైన  రాష్ట్ర విభజన  అని చెప్పక తప్పదు. అధికారం కోసం ఎంతటి నీచానికైన తెగించే చరిత్ర అధికార రాజకియ పక్షాలది.ఎవరు ఎమన్నా  రామారావు గారు అధికారానికి రాక ముందు ఉన్న హైద్రాబాద్ ని ఒక్క సారి ఊహించుకుంటే కనపడేవన్నీ మత కలహలే. దానిని రూపుమాపి నగరాన్ని ఒక హై.టెక్ నగరంగా అంతర్జాతీయ స్తాయికి తీసుకు వెల్లిన ఘనత  తెలుగు దేశం  పార్టీదే అని ఒప్పుకోక తప్పదు. కాలం ఎప్పుడూ ఒకే రీతిలో ఉండదు.రాజకీయ కారణాల వల్ల విబజన అనివార్యం కావచ్చు. కాని దాని కోసం మత పరంగా బలపడాలనే ఉద్దేశ్యం  తో "సందట్లో సడే మియ"లు చేసే ప్రతిపాదనలు కార్య రూపం దాలిస్తే నాడు హైద్రాబాద్ లో ఉన్న మతకల్లోలాలు యవత్ తెలంగాణా రాష్ట్రం  అంతా ఉంటాయి అని గ్రహిస్తే మంచిది.            

Friday, August 23, 2013

పదేళ్లు పైన కఠిన శిక్ష పడుతుందన్న భయంని, "పశువాంచ" అధిగమిస్తుందా!?.



                                                            


 అవుననే అనిపిస్తుంది. వేయి నిర్బయ చట్టాలు తెచ్చినా ఈ దేశంలో ఆడపిల్లలకి లైంగిక దాడుల భయం పోగొట్టలేము అనేది రూడి అవుతుంది. అసలు నాకొక అనుమానం ఏమిటంటే ,ఏదైన సంచలనాత్మక కేసు జరిగినపుడు ఈ పోలిసులు పట్టుకుంటుంది అసలు నేరస్తులనేనా? శిక్షలు విదించాక అసలు వారినే జైలులో ఉంచుతున్నారా? లేక బినామీలు ఉంటున్నారా? అలా ఉంటే వారిలో ఎందుకు పరివర్తన రావటం లేదు? అసలు చట్టం అంటే ఎందుకు నేరస్తులకు భయం లేకుండా పోతుంది? ఇవ్వన్ని అమాయకుడైన నా  లాంటి వారికి జనియించే ప్రశ్నలు.

  మొన్న డిల్లిలో జరిగిన నిర్బయ రేప్ ఉదంతం లో, ముందు మేమే నేరం చేసామని అంగీకరించిన నేరస్తులు, ఆ తర్వత మేము నిర్దోషులమని మొరపెట్టుకున్నారు. మొదట పట్టుకున్నప్పుడు వారి ముఖాలు అవి కనపడకుండా తీవ్రవాదులకి ముసుగులు వేసినట్లు వేసి మీడియా కంట పడకుండా తీసుకు వెలుతుంటారు పోలిసులు. అదేమిటంటే రేప్ లాంటి సున్నిత కేసులలో ముఖాలు చూపించడం కుదరదు అంటారు. రేప్ కు గురైన స్త్రీకి ఆ నిబందన వర్తిస్తుంది కాని, నిందితులకు ఎలా వర్తిస్తుంది. అటువంటి నీచ కార్యాలు చేసిన వారు ఎవ్వరో సమాజం తెలుసుకోవాలి. కాని అంతా సీక్రేటే అయితే నిజమైన నేరస్తులకే శిక్షలు పడుతున్నాయి అని గ్యారంటీ ఎమిటి? వారే జైలులో ఉంటున్నారన్న గ్యారంటీ ఏమిటి?

  నిన్న ముంబయిలో జరిగిన ఉదంతం కూడా అంతే .అయిదు పశువులు ఒక పొటో జర్నలిస్ట్ ని రేప్ చేసాయి. నిర్బయ కేసులో మాదిరే అమ్మాయి  భాయిప్రెండ్ సాక్షిగా రేప్ జరిగింది. రేప్ జరిగిన రెండు గంటల తర్వాత పోలిసులకు పిర్యాదు అందీంది. ఇది జనాలకు తెలిసి గొడవ అవగనే వెంటనే ఇద్దరిని పోలిసులు పట్టేశారట! వారి ముఖాలు మీడియ కంట బడకుండా చేసారు. అదేమిటంటే సున్నితమైన కేసు అని సమాదానం. అయిదుగురులో ఇద్దరు రౌడీ షీటర్ లట! అందరిని పట్టుకున్నరని ఒక వార్త. కాదు ఇద్దరినేనని పోలిసుల సమాచరం. భాదితురాలను కాని, వారి కుటుంబం గురించి కాని తెలియ చేయక పోయిన పర్వాలేదు. కాని ఆ పశువులు ఎవరో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి వ్యక్తికి ఉంది.

  డిల్లీ ఉదంతం, ముంబాయి ఉదంతం లో ఇంచు మించు విషయం ఒకటే. అమ్మయి బాయిప్రెండ్ తోడుతో నిర్జన ప్రాంతం(బస్సులో అయిన అదే) లో కనపడ్డారు. క్రూర జంతువుకి సాదు జంతువును చూస్తే ఎంత ఆనందమో, ఒక అమ్మాయి అబ్బాయి నిర్జన ప్రాంతంలో  కనపడితే మ్రుగాళ్లకు అంత ఆనందం. జరిగే ప్రతి దానికి ప్రబుత్వాన్ని, సమాజాన్ని నిందించినంత మాత్రాన మన ఆడపిల్లలకు  లభించే రక్షణ నామ మత్రమే. ఎవరి జాగ్రతలో వారుండాలి. అలా ఉన్నప్పటికి లైంగిక దడులు జరిగితే ఆ దాడులను చేసిన వారిని అమ్మాయి తరపు బందువులు అది మొత్తం కుటుంబం మీద జరిగిన దాడిగ బావించి నేరస్తుడికి పూర్తీ కాలం శిక్ష పడేల చెయ్యడానికి పంతం కట్టి పని చెయ్యాలి. ఎక్కడా రాజి  పడరాదు. అవసరమైతే పోలిస్ ప్రాసిక్యూషన్ కి తోడుగా ప్రైవేట్ లాయర్ని పెట్టి కేసును ఆసాంతం పర్యవేక్షీంచాలి. ఆర్దికంగా స్తోమత లేని వారు స్వచ్చంద సంస్తల సహాయం తీసుకోవాలి. మనం ఎంత రాజ్య రక్షణ విదానం  లో ఉన్న మన ప్రాణాలు, మానాలు తీసిన వారిని శిక్షించడంలో  ప్రభుత్వం విఫలమైతే ఆ పని మనం చేసినా తప్పు లేదని నా అభిప్రయం . అలా  అయిన నేరస్తులకు భయం ఉండి నేర కట్టడి జరిగే అవకాశం ఉంది.              

Wednesday, August 21, 2013

వీదిలో o.k. అని ఇంట్లోకి వచ్చి బావురుమంటున్న "బాబులు"

                                                             
    

 మొత్తానికి సోనియమ్మా సీమాంద్ర లోని లోని రాజకీయ బాబులుకు కంటిమీద కునుకు లేకుండా చేసింది . పాపం వారి పరిస్తితి చూస్తుంటే , జాలేస్తుంది . వీరి పరిస్తితి ఎలా ఉందంటే , వేలం పాటలో ఎచ్సులుకు పోయి నష్టానికి పాటపాడి , చివరకు ఉంచుకొలేక , వదులుకోలేక యాతన పడే పాటదారులా ఉంది .

  తెలంగాణా ఏర్పాటుకు అందరూ సై  అన్న వారే . ఇప్పుడేమో మీరు కాదని ఉంటే తెలంగాణాను  మా "అమ్మ " ఇచ్చేది కాదని అధికార పక్షం వారు బోరు మంటుంటే , "ఇస్తే ఇచ్చింది కానీ , సీమాంద్ర వారి ప్రశ్నలకు సమాదానం చెప్పకుండా ఇస్తే ఎలా కుదురుద్ది ? అని ప్రతిపక్షం వారు కన్నీళ్ళు పెట్టుకుంట్టునారు.  కాని ఇప్పట్టికైనా "అమ్మా , మీరేదో రాజకీయ డ్రామా కోసం అడిగారని "లేఖలు " ఇచ్చాం కానీ , మీరు సిన్సియర్గా అడుగుతునారని అనుకోలేదు తల్లీ " , కాబట్టి మా లేఖలు కి సీమాంద్ర ప్రజల అభిప్రాయానికి ఎటువంటి సంబందం లేదు . మేము  ఈ  విషయంలో "న్యూట్రల్ " గాళ్ళం , అని ఒక్క మాట నిజాయితీగా ఒప్పుకుంటే ,బంతిని కేంద్రం కోర్టులోకి తోసినట్లయేది . కాని అలా  చెయ్యరు . ఇంకా రాజకీయంగా ఏదో బావుకుందామనే ఆలోచన కాబోలు . తెలంగాణ ఇస్తే సీమాంద్రలో కాంగ్రెస్ పార్టీ , తెలుగు దేశం పార్టీ దాదాపు తుడిచి పెట్టుకు పోవడం ఖాయం . ఇవ్వకపోతే తెలంగాణాలో కొన్ని ప్రాంత్తాలలో దెబ్బ తింటాయి . హైదరాబాద్, రంగారెడ్డి ,ఖమ్మం ఇంకా కొన్ని ప్రాంతాలలో లోసెట్టిలర్స్ ప్రబావం ఎక్కువ అనేది పార్టీలు మరువ రాదు . కాబట్టి ఒక వేళ రాజకీయ లబ్ది కోసమే అయితే సమైక్యతకి వ్యతిరేఖంగా నిర్ణయం తీసుకున్న పార్టీలు నష్ట పోక తప్పదు .ఇప్పుడు నష్ట నివారణ కోసం ."ఆత్మ గౌరవ యాత్రలు , ఆత్మ ప్రబోద యాత్రలు , ఆత్మ ఘోష యాత్రలు అంటూ ప్రజలకి స్పష్టంగా తమ మనసులోని మాట చెప్పకుండా మబ్య పెట్టె పనులు చేస్తే , రెండు ప్రాంతాలలో కూడా  పార్టీ కి డిపాజిట్లు పోవడం ఖాయం . 


పిబ్రవరి ఒకటో తారీఖునే ఈ  బ్లాగులో స్పష్టంగా చెప్పాను.  "తెలంగాణా" ఇవ్వదనే గుడ్డి నమ్మక్కంతో. అందరూ విబజనకు సై  అన్నారు , కాని సోనియా గాంది వీరి పిల్లకాయ మాటలను నమ్మింది కాబట్టి తెలంగాణా ఇవ్వడానికే సిద్ద పడింది. ఎవరు అవునన్నా కాదానా  కాంగ్రెస్ అదిష్టానం తెలంగాణా ఇస్తుంది. అంద్రావాళ్ళ పిల్లాటలకు తగిన మూల్యం చెల్లించక తప్పదు"  అని .మరొక సారి  పోస్టును చూడాలనుకుంటే ఈ  లింక్ మీద క్లిక్ చెయ్యండి .http://kalkiavataar.blogspot.in/2013/02/blog-post.html .         
   .

Tuesday, August 20, 2013

ఈ ఉద్యమాల వల్ల ఉన్నది పోయేటట్లు ఉంది! ఉంచుకున్నది పోయేటట్లు ఉంది!


                                                                   


  మొన్నటి దాక తెలంగాణా వాళ్ళు చేసిన ఉద్యమానికి మెచ్చి అధిష్టాన దేవత,తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సందర్బంగా వారు చెప్పిన మాట ఏమిటంటే ,పదేళ్ళ పాటు హైద్రాబాద్ ఉమ్మడి రాజ్యదానిగా ఉంటుందని. దీని కోసం ఏర్పాటు ప్రక్రియ ఆరు నెల్లలో ముగిస్తాం అని. అంతే ! సీ మాంద్రుల పక్కల్లో బాంబు పేలినట్లై, ఒక్క పెట్టున సీమాంద్రులు సమైఖ్యాంద్ర కొరకు ఉద్యమించేసరికి, "మీరేదైనా సమస్యలు ఉంటే ఆంటోని గారికి చెప్పండి, మీ సమస్యను ఖచ్చితంగా తీరుస్తాం, కాకపోతే ఒక కండిషన్ ఏమిటంటే, మీరేదైనా అడగండి,సమైక్యాంద్ర తప్పా"’ అని నొక్కి చెప్పే సరికి సీమాంద్రులకు సిట్యూషన్ అర్దమై "అయితే మాకు హైద్రబాద్ ని U.T.  గా చూడాలనుంది" అని వరం కోరుకున్నారు. దీనికి కేంద్రం వారు హాపిగ ఒ.యస్ అనడానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణా వాదులకు ఆ దిశగ సంకేతాలు ఇచ్చేస్తున్నారు కూడా!

  ఒకరు,  ఒకటి ఆశించినపుడు,వేరొకటి త్యాగం చేయక తప్పదు. అసలు ఇంత తొందరగా తెలంగాణ ప్రకటన చెయ్యడం వెనుక, తెలంగాణా ప్రజల కోరిక తీర్చడం కంటే ,దేశం లోనే ఎంతో అభిరుద్ది చెందినది గా బావిస్తున్న హైద్రబాద్ నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గ చెయ్యాలన్న ఆత్రుతే ఎక్కువుగా ఉన్నట్లుంది. దీనితో ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడినట్లవుతుంది.

  (1). అరవైయేండ్ల సమస్య అని చెప్పబడుతున్న "తెలంగాణా" ఇచ్చినట్లవుతుంది.

   (2). సీమాంద్రుల ప్రత్యమ్నాయ కోరిక ప్రకారం వారి భయాలకు పుల్స్టాప్ పెడుతూ, కేంద్ర పాలిత ప్రాంతం ఉంటుంది. భవిష్యత్ లో దేశ రెండవ రాజదానిగా  చెయ్యడానికి ఎటువంటి అడ్డంకులు అంటే ప్రత్యేకంగా ఏ ప్రాంత ప్రజలకు పాకేజీలు ఇవ్వ వలసిన పని ఉండదు.

  (౩). రెండు రాష్ట్రాలలో అధికార కాంగ్రెస్ తిరిగి అదికారం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.

  కాకపోతే ఈ ఏర్పాటు వల్ల తీవ్రంగా నష్ట పోయేది తెలంగాణా ప్రాంతమే. ఎందుకంటే హైద్రాబాద్ లేని తెలంగాణ తల లేని మొండేం లాంటిది. కాని సీమాంద్రుల కోరికకి వ్యతిరేకంగా  తెలంగాణా పొందినపుడు, ఆ మాత్రం త్యాగం చెయ్యడం తప్పనిసరి అని తెలంగాణా వాదులను వొప్పించడం కేంద్రానికి పెద్ద సమస్య కాక పోవచ్చు.ఇప్పటిదాక జరిపిన ఉద్యమాలతోనే, విసిగి వేసారి ఉన్న తెలంగాణా యోదులు చివరకు గత్యంత్రం లేని పరిస్తితుల్లో హైద్రాబాద్ నిU.T.   చెయ్యడానికి ఒప్పుకోవచ్చు. ఆ విదంగ రెంటికి చెడ్డ రేవడి మాదిరి తెలంగాణా ప్రజలు మరొక మారు రాజకీయ నాటకాలకు మోసపోబోతున్నారు అని అనిపిస్తుంది.

  కాబట్టి ఈ  నాటకాలకు ఫుల్స్టాఫ్ పెట్టాలంటే, ఇరుప్రాంత మేదావులు బేషజాలకు పోకుండా ,అసత్య ప్రచారాలను కట్టిపెట్టి ,వాస్తవ పరిస్తితులను సమీక్షీంచి, మొత్తమీద తెలుగు ప్రాంత అధికారాలను, వనరులను తెలుగు ప్రజలకు మాత్రమే చెందేలా, ఒక వివేక మైన నిర్ణయానికి రావల్సిందిగా రాబోయే తరాల వారి తరపున అమాయకంగా అర్దిస్తున్నాం.                  

Friday, August 16, 2013

ఐదేళ్ళ పాటు కే .సి.ఆర్ గారి అద్వర్యంలో "ట్రయిల్ తెలంగాణా " నడపితే తెలుస్తుంది !

                                                                
                                                                 

 తెలంగాణా యువతలో, ఉద్యోగులలో , విద్యార్దులలో చాలా ఆశలు ,అపోహలు ఉన్నాయి  వాటిని క్లియర్ చెయ్యకుండా ఒక వేళా సమైక్య వాదులు అడుగుతున్నట్లు , రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచినా , అది ఆందోళనా ప్రదేశ్ లాగే ఉంటుంది తప్పా , ఆంద్ర ప్రదేశ్ లాగా ఉండదు . ఎవరెన్ని చెప్పినా తెలంగాణా ప్రజల మనసులలోఆంద్రా వారి పట్ల ఉన్న బావాలు మారిపోవడం కష్టం . అటు సీమాంద్రులలో కూడా  విబజన గురించి ఉన్న బావోద్వేగాలు తొలగించడం కష్టం . ఎలాగూ  పదేండ్లు ఉమ్మడి రాజ్యదాని అంటున్నారు కాబట్టి ఒక పని చేస్తే ఎలా ఉంటుంది .?

  తెలంగాణా ఏర్పడితే నిర్యుద్యోగం ఉండదని ,ఉపాది అవకాశాలు మెరుగవుతాయి అని తెలంగాణా వారు ఆశ పడుతున్నారు . తెలంగాణా నీటి వనరులతో సస్య శ్యామలం అవుతుందని రైతన్నల నమ్మక్కం . లేదూ  రెండు ప్రాంతాలకు నష్టమే అని ఆంద్రా వారి వాదన . తెలంగాణా ఏర్పడినాక రెండేళ్ళలో యువత ఆశలు తీర్చక పోతే ,మరొక  సామాజిక తెలంగాణా ఏర్పాటు కొరకు లడాయి తప్పదు . అంతా గందర గోళం అవుతుంది . కాబట్టి ఒక అయిదేళ్ళ పాటు "ట్రయిల్ తెలంగాణా " ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది ?

    k.c.r  గారి ఆద్వర్యంలో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మండలి ఏర్పాటు   చేయ్య్యాలి సీమాంద్రులకు చోటు ఉండరాదు . ఆ  మండలికి అన్ని విషయాలలో శాసన సబ కు ఉండే అధికారాలు ఇవ్వాలి . అలా ఐదేండ్లు పాలన కోన సాగించాక ఆ మండలి అద్వర్యంలో నే తెలంగాణా లో ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి . 2/3 వంతు ప్రజలు అనుకూలంగా ఉంటే "ట్రయిల్  తెలంగాణా " ను "రియల్ తెలంగాణా " గా ప్రకటిస్తూ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు చెయ్యాలి . అక్కడనుండి 5 యేండ్ల లోపు ఆంద్రా వారు రాజదాని ఏర్పాటు చేసు కోవాలి . మొత్తానికి అలా చేస్తే మనం ఊహించేది  అరచేతిలో స్వర్గమా , అసలు స్వర్గమా అనేది తేలిపోతుంది .

Tuesday, August 13, 2013

ఎదురు తిరిగిన ఉద్యోగి "నిజాం " అయ్యాడు . బాంచన్ కాల్మొక్త అన్నోడు "బానిస " అయ్యాడు!

  
                                                                     
  


  ఇది జరిగిన చరిత్ర . తెలంగాణా గడ్డ సాక్షిగా జరిగిన చరిత్ర . 17 వ శతాబ్ద మలిదశలో ఉజ్బెకిస్తాన్ నుండి వచ్చిన వారు "అసప్ జాహి " వంశీయులు ,మొగలుల కొలువులో ఉద్యోగులుగా చేరారు . వారే మొగలులు బలహీనులై తమ రాజ్యాలను పరిరక్షీమ్చుకోలెని  తరుణంలో నిజాం లుగా  స్వతంత్రం ప్రకటించుకుని  హైదరాబాద్ రాష్ట్రానికి నవాబులయ్యారు . అంటే ఇక్కడ వారు సరి అయిన సమయంలో చూపిన తెగువ , దైర్య సాహసాలే వారిని పాలకులుగా చేసింది . కాని స్తానికంగ ఉన్నాప్రజలు  పామరులు కాబట్టి బానిసలు గా మిగిలి పోయారు తప్పా , బారత దేశం లో హైదరాబాద్ కలిసే దాక బంద విముక్తులు కాలేక పోయారు . అలాగే అటు తెల్లవారు సైతం ఈస్ట్ ఇండియా  కంపెనీ ఉద్యోగులుగా వచ్చి,స్తానిక రాజులు మద్య తంపులు పెట్టి, పరిపాలన హస్తగతం చేసుకుని చివరకు భారత దేశాన్ని తమ రాణీ పరిపాలన క్రిందకు  తెచ్చారు . ఇదే మన బానిస మనస్తత్వ ఘన  చరిత్ర. . ఆ తర్వాత మహానీయుల త్యాగ పలితంగా స్వాతంత్ర్యం వచ్చింది . అది వేరే విషయం . 

  ఇక్కడ నేను ప్రస్తావిస్తుంది ఏమిటంటే , ఉద్యోగులలో ఉండే ఆత్మాభిమానం , స్వాతంత్ర కాంక్ష సామాన్య జనంలో కాని , వారిని ఏలే నాయకులలో కాని ఉండవా ? ఇప్పుడు రగులుతున్న సీమాంద్రా ఉద్యమంలో కాని ,పోయినేడు రగిలిన తెలంగాణా ఉద్యమంలో కాని ఉద్యోగులదే ప్రదాన పాత్ర . వారిలో కొంత మంది రాబోయే ఎలెక్షన్లలో పోటి చేసి పాలకులుగా మారనున్నారు . కాని రాజకీయ నాయకులు మాత్రం "అమ్మా ,అమ్మా , "అని డిల్లి అధిష్టానం చుట్టూ తిరుగుతూ ,తెలుగుజాతి పరువును ,అత్మాభిమాన్నాన్ని , ఈ  జాతి గురించి ఏమి తెలియని ఒక "అమ్మ "చేతిలో పెట్టారు . ఆవిడ  గీసిన గీత దాటడానికి ఒంటిమీద బట్టలు తడుపుకునే వారు , ఆమెను ఏమి అనలేక జనాఆగ్రహాన్ని  చూపించి , తమ విన్నపాలు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు ,బాంచన్ కాల్మొక్త వారసులు .  

 ఇదంతా చూస్తుంటే రానున్న రోజుల్లో అటు ఆంద్రలో ,ఇటు తెలంగాణా లో పౌరుషాన్ని చూపిస్తున్న ఉద్యోగులే నాయకులై తెలుగు సీమ ను ఏలేటట్టు ఉన్నారు . అదే జరిగితే చరిత్ర పునరావృత మయినట్లే . కాక పోతే ఒకటే తేడా !. వారు విదేశియులు , వీరు స్వదేశియులు అంతే.  హట్సాప్ అత్మాభిమాన ఉద్యోగులారా !

Monday, August 12, 2013

మీరు తెలంగాణా గురించి అడగకండి. వారిని హైద్రాబాద్ అడగకుండా చేస్తాం!


                                                                         



  మీరెదైనా సమస్య ఉంటే ఆయన గారి కమిటీకి చెప్పంది. మీకు పూర్తి స్వెచ్చ ఉంది. మీ సమస్యలు చెప్పటానికి. అయిందేదో అయిపోయింది. ఇక సమైఖ్య ఆంద్రప్రదేశ్ గురించి మరిచి పొండి.మీరడిగినట్లు సమైక్య ఆంద్ర ఉంటుంది ఆంద్రప్రదేశ్ రూపంలో.అందులో తెలంగానా మాత్రం ఉండదు. మీరు ఇచ్చే స్లోగన్ లు అన్నీ సమైక్య ఆంద్రా, సమైక్య ఆంద్రా అన్నారు కాని ,పూర్తిగా సమైఖ్య ఆంద్రప్రదేశ్ అన్నారా? లేదు! ఎక్కడో ఒకటీ, అర  అని ఉంటారు. మరి మీకే సమైఖ్య ఆంద్రప్రదేశ్ ఆంటానికి బద్దకమైనప్పుడు, డిల్లీ వారికి మాకెంత ఉండాలి. అందుకే మీరు కోరినట్లే సమైక్య ఆంద్రా ఉంచాం. తెలంగాణా విబజించాం. మీ ఆంద్రా  పార్టీలు లాంటి ది కాదు,మా డిల్లీ పార్తీ. ఒక్క సారి మాట ఇస్తే మా మాట మేమే వినం. ఆప్ట్రాల్ ఆంద్రా వాలాలు. మీరెంత!

  ఈ రోజు మీ సీతయ్య తెలుగులో మట్లాడతాను అని అంటే మాత్రం రాజ్యసభలో మా స్పీకర్ ఏమన్నాడు? ముందుగా తెలియ చెయ్యకుండా మీ మాత్రుబాషలో మాట్లాడడానికి వీలు లేదన్నాడా, లేదా! అదీ మీ పరిస్తితి దేశ చట్ట సబలలో. !హిందీ,ఇంగ్లీష్ తప్పా భారత భూమిలో భారతీయ ప్రజలు మాట్లాడాడానికి ముందస్తు అనుమతి కావాలి.లేకుంటే ఎప్పుడూ పడితే అప్పుడు ట్రాన్స్లేటర్ ఉండదు. మీరు చెప్పేది మాకర్దం కాదు. అందుకే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఒకే బాష మాట్లాడే వారు శత్రువులు. అందుకే వారిని విడదీస్తుంటాం. అన్య బాష ల వారి మద్య సౌబ్రాతుత్వం పెంచుతుంటాం. ఎవడు ఎటు పోయినా మాకు పెద్దగా పట్టింపు లేదు. సీట్లు ఎన్ని వచ్చాయా అనేదే ముఖ్యం. దానికోసం ఎవరినైనా చీల్చేస్తాం. ఇది మా నైజం. మాకు తెల్లోడు నేర్పిందదే! మా నుండి మీరు నేర్చుకోబోయేది అదే. అందుకే వారికి కావలసిన తెలంఘాణా వారికి ఇచ్చాం. మీకు కావల్సిన హైద్రాబాద్ లో వాటా మీరు తీసుకోండి. తెలంగాణా విషయంలో మీరు మాట్లాడవద్దు. హైద్రాబాద్ యు.టి. విషయంలో రేపు వారిని మాట్లాడకుండా చేస్తాం. ఆంటొనీ కమిటీ వేసిందే అందుకు కదా! మొత్తానికి" తాగినోడే కడతాడు తాళ్ళ పన్ను" అని" ప్రత్యేక రాష్ట్రం అడిగినోడే కోల్పోతాడు హైద్రాబాద్".ఇదే మేము ఇచ్చే తీర్పు!      

Saturday, August 10, 2013

తీర్పు చెప్పినాక ,సమస్య గురించి అడిగే "తిక్కల పంచాయతి " ఎక్కడైనా ఉందా ?



  ఎక్కడో ఎందుకు ! ఇప్పుడు రాష్ట్రాన్ని ఆందోళన పదం వైపు నడిపిస్తుంది ఆ తిక్కల నిర్ణయాలే . తెలంగాణా  విషయం అరవై ఏండ్ల నాటిదట . ఆమె తాత గారు ,అత్తగారూ ,భర్త గారు ఎవరూ ఆ సమస్యని తేల్చ లేక పోయారు .ఆమె గారు కూడా  గత పదమూడేళ్ళుగా ఎన్నికల్లప్పుడు మాత్రమే రంగం మీదకొచ్చే తెలంగాణా సమస్యను సీరియస్ గా పట్టించుకోలేదు.నాలుగేళ్ల క్రితం అందరి అభ్ప్రాయం అడిగితే ,ఆ..  అరవై యేండ్ల గా ఇవ్వనిది , రోజు ఇచ్చి చస్తారా అని ,డ్రామా అంగీకారాలు తెలిపారు . ఇప్పుడెందుకో అధిష్టాన దేవతకి ఆ సమస్యను తీర్చాలనుకుందట . తీర్చాలనుకున్నపుడు అందులోని కష్ట నష్టాలు , ఇరువైపులా ప్రజలు బావోద్వేగాలు  అన్ని పరిగణనలోకి తీసుకుని, ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు వాళ్ళ ఎవరికీ నష్టం జరగదని అభిప్రాయానికి వస్తే ,అప్పుడు ఏర్పాటు నిర్ణయం ప్రకటించాలి .ఒక సారి ప్రకటించాక ఇక సమస్యలు తెలుసుకునేదంటో  ఏమి ఉండదు. అదీ పద్దతి .
  అంతే కాని ,తెలంగాణా విభజన నిర్ణయం ప్రకటించి ,మల్లీ సమస్యలు ఏమైనా ఉంటే చెప్పుఖోండని "ఆంటోనీ " గారి కమిటీ వెయ్యడమేమిటీ ? తిక్కల నిర్ణయం కాకపోతే ! ఇప్పటికైన పార్టీలు ముసుగు తొలిగించి తమ మనసులోని అసలు మాట చెపుతారని గ్యారంటీ ఉందా ? లేదు . మరి ఎందుకు పనికి మాలిన కమిటీలు . ఏదైనా ఒక్క విషయం స్పష్టం . రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ నిర్ణయం . దానిలో ప్రజా అభిప్రాయానికి గౌరవం ఇవ్వాలనుకుంటే , పార్తీలను కాదు డైరెక్ట్గా ప్రజలను అడగండి ,రాష్ట్ర విభజన అంగీకారమా ,కాదా ? అని . మెజార్టీ ప్రజల అభ్ప్రాయానికి కట్టుబడండి . దీనికి రెఫరెండం అవసరమైన వెనుకాడవద్దు . కాదూ , రాజ్యాంగ ప్రకారం చేదామనుకుంటే ,అసెంబ్లి తీర్మానం ,పార్లమెంటులో బిల్లు పెట్టి మీ కోరిక నెరవేర్చుకొండి అప్పుడు ఎవరు అవునన్నా ,కాదన్నా చెయ్యగలిగేది ఏమి ఉండదు . అంతే కాని తిక్కల పంచాయితి పెట్టి ప్రజలను ఎందుకు బలి చేస్తారు .  

Friday, August 9, 2013

ఇంటి కుక్క , ఇంటి కుక్క ... అన్న చందానా ....

నేను ఇందాక ఒక బ్లాగులో రాయలసీమ యాసలో "బేట్రాయి సామి దేవుడా " అన్న మకుటంతో ఉన్న జానపద పాట చూసాను . చాలా బాగుంది .దశవతార వర్ణన వారి మాండలికంలో చక్కగా కూర్చారు . నేను కవిని కాను . ఆ సంగతి నాకు తెలుసు . కాని కదిరి నరసింహుడి ఉద్దేశించి పాడిన ఆ జానపదం చూసాక నాక్కూడా ఎదో ఒకటి ఆ స్వామీ ని అడగాలనిపించి ఇలా అడిగాను (రాసాను ).బాగున్నా ,బాగోకున్నా లైట్ తీసుకోండి  నేను ఇంతకు ముందు "కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"? అని  ఒక టపా పెట్టాను . ఇంట్రస్ట్ ఉంటే లింక్  చూడండి
 http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_10.html


బేగి రా సామి దేవుడా -మమ్ము కాపాడ 
బేగి రా సామి దేవుడా
కల్కీ అవతారుడా !కదరి నరసింహుడా 
జల్దీగా వస్తువని నమ్మి నేనుంటిరా                         I బే I 

సరాజ్యం వచ్చెనని -అంతా మనదేనని 
అయిద్రబాద్ కొస్తిమి 
అరవై యేండ్లు గడచినాక ,నీది గాదు 
జాగాoటే నేనేడ  బోదురో !                              I బే I 


వెనుక ముందు కానక  _ఒక్క చోట కూడ బెట్టి 
నడమంత్రపు నగరి చేస్తే ,
నట్ట నడుమ లొల్లి ఎంది  ,బిస్తర్తో  
బిచాణా లేప మంటురేందిరో                                       I బే I 


తన్నులు తన్నిన నవాబుని      తాత అనబట్టే   ,
తమ్ముడైన నన్ను, కాదు పొమ్మన బట్టే ,
తెలుగోడు ,తెలుగోడు ఒకటి కాదన బట్టే  
తెలుగు తెల్యనోడిని బాయి  బాయి  అనబట్టే                   I బే I 

ఇంగ్లిషోడి  కాలంలో కల్సి బ్రతకలెకపొయే ,
తెలుగోడి పాలనలో తంపులతో విడిపోతే ,
ఎప్పటికైనా మన బతుకింతేనా ,ఇంటి కుక్క ,
ఇంటి కుక్క ... అన్న చందానా ....                         I బే I     



















Thursday, August 8, 2013

తలా తోకా లేని వీరబోగ వసంత రాయలుకు పోటిగా అవి మాత్రమే ఉన్న "వీర బ్లాగుడు" రయిటర్ ప్రత్యక్షం.



                                                       



  నేను బ్లాగు ప్రారంభ డశలో " డిసెంబర్ 21,2012 యుగాంతం" అనే దానికి కొన్ని ఆంశాలు తీసుకుని ఈ బ్లాగులో టపాలుగా ప్రచురించాను. ప్రపంచ వ్యాప్తంగా యుగాంతం మీద ప్రజకు ఉన్నట్లే మన వారికి ఉన్న ఆసక్తి తో కావచ్చు, లేక కొంత హ్యుమరస్ టచ్ ఉండటం చేత, నా పోశ్టులను ఆసక్తిగా వీక్షీంచారు. వారికి నా దన్య వాదాలు. నేను వీరబోగ వసంత రాయలు గురించి కాని, కల్కి అవతారం గురించి కాని ఏ గ్రందాలు సీరియస్ గా చదివి చెప్పలేదు. కేవళం గూగుల్ సెర్చ్ ఆదారంగా ఏ రోజు టపా కోసం ఆ రోజే పరిశిలించి రాసిన టపాలు అవి.నిజంగా కల్కి అవతారం కాని , వీరబోగ వసంతరాయలు అవతారం కాని హిందూ మత విశ్వాసాలు నుండి పుట్టినవి. కాని హిందూ మతం కి వ్యతిరేకంగా ప్రవచనాలు చేస్తూ, తమ మతమే గొప్పదని ప్రచారాలు చేస్తున్న వారు సైతం ఎంతవరకూ వెళ్ళారంటే హిందూ మత గ్రందాలలో చెప్పిన ఆ అవతార పురుషులు కూడా తమ వారేనని, వారి గురించే హిందూ మత గ్రందాలు ఘోషించాయి అని ఆకుకు అందని పోకకు పొందని ఉపమానాలతో బాష్యాలు చెపుతూ అనేక వెబ్ సైట్లలో తమ స్వీయ  పరిశోదనలు వెళ్ళక్రక్కారు. అవ్వన్నీ చదవి నాకు నవ్వు వచ్చింది. ఒక పక్కేమో హిందూ  అవతర సిద్దాంతం హంబగ్ అంటారు. ఇంకొక ప్రక్క హిందూ గ్రందాలలో చెప్పింది అన్య మత ప్రవక్తలు గురించే అంటారు. ఈ విదంగా సాద్యమైనంత వరకు తమ మతాలను స్వికరించిన హిందువులను సంత్రుప్తిపరచడానికి, లేక మరింత మంది హిందువులను మత మార్పిడి చెయ్యడానికి విశ్లేషణలు, పరిశోదనలు పేరుతో  ఈ వంకర సంకర రాతలు మొదలు పెట్టి ఉంటారని నా నిచ్చితాభి ప్రాయం.


  ఈ మద్య ఒక బ్లాగ్ మిత్రుడు కల్కి అవతారం గురించి వాస్తవాలు చెపుతానంటూ ఒక సీరియల్ టపా రచన మొదలు పెత్టాడు. అందులో నా టపాలు గురించి ఎవరో అడగగా, నావి తలా తోక లేని టపాలు అని తనవి ఆ రెండూ మాత్రమే ఉన్న వాస్తవ విషయాలు అన్నాడు. సరే ఆయన గారిది ఆయనకి గొప్ప కావచ్చు. కాని నాది తలా తోక లెనిది అనడం ఎందుకు? నేను రాసింది సీరియస్ మేటర్ ఏమి కాదు. వాస్తవం అంటూ ఎవరికి చెప్పలేదు.ఇప్పుడు వాస్తవాలు చెప్పే వారు వచ్చారు కాబట్టి ఇక వీక్షకులు హాపీసూ.కాకపోతే చిన్న డౌట్ ఏమిటంటే ఆయన గారి బ్లాగులో బికినీ బామలు అడ్వర్టైస్మెంట్లు సైతం దర్శనం ఇస్తున్నాయి. కాబట్టి నా టపాలు కంటే ఆయనవి కొంచం రంజుగా కూడా ఉండొచ్చు. సీ అండ్ ఎన్జాయి.     

Wednesday, August 7, 2013

"బాంచన్ నీ కాల్మొక్తా" అంటేనే రాష్ట్ర విభజన ప్రకటించారట !

                                                                     
                                                          

   "బాంచన్ నీ కాల్మొక్తా" అనే బానిస బావజాలం తెలంగాణా లో నిజామ్ ప్రభువులు కాలంలో ఉండేది. అప్పటి తెలంగాణా భూస్వామ్య వ్యవస్తలో సామాన్య ప్రజలు ఎవరైనా సరే, దొరల ముందు మాట్లాడేటప్పుడు ప్రతి మాటకు బాంచన్ నీ కాల్మొక్త అని మాత్రమే తమ గోడుని చెప్పుకునే వారట! అలాంటి పద్దతి ఇప్పటికి తెలంగాణాలో కొన్ని ఏరియాలలో ముసలి వారు పాటిస్తూ ఉండవచ్చు. అంటే తమ ఊరి దొరల క్రింద తాము ఎప్పటికీ బానిసలమేనని, దొరని కాదని తాము ఏమి చెయ్యలేమని, తాము దొరల మోచేతి నీరు త్రాగుతూ బ్రతుకుతున్నామని సవినయంగా మనవి చేసే అలవాటైన ఊత పదం "బాంచన్ నీ కాల్మొక్త".

  అయితే దొరల రూపం మారింది. అలాగే బానిసత్వ రూపం మారింది. కాని బానిస మనస్తత్వం పోలేదు. తెలంగాణాలో కమ్మూనిస్టుల పుణ్యమా అని బాంచన్ నీ కాల్మొక్త అనే వారు విప్లవ వీరులు అయ్యారు. ఎవరినైతే దొరా అని సాగిల పడ్డారో వారినే నరికి వేశారు. అక్కడ ప్రజలు తెలంగాణా ఏర్పాటు కోసం కూడా ఎవరినీ "బాంచన్ నీ కాల్మొక్త" అని ప్రాదేయపడ్డ దాఖాలాలు లేవు. కాని ఆ సంస్క్రుతిని సీమాంద్ర మంత్రులు పాటించినట్లు తెలుస్తుంది.

 N.T.V     వారి కదనం ప్రకారం సీమాంద్ర మంత్రులకు, రాష్ట్ర విబజన గురించి కొన్ని నెలల ముందే తెలుసట! వారికి అన్ని తాయిలాలు ఇచ్చాకే సోనియా గారు రాష్ట్ర విబజనకు తెర తీసారట! ఆంద్రా ప్రజలు తెలంగాణా ప్రజలు లాగా ఉద్యమాలు చేయలేరని, ఒక వేలా చేస్తే గీస్తే మంత్రులైన తామే ఆ ఉద్యమాలను లీడ్ చేయాలి అని, తాము ఒప్పుకుంటే ఆంద్రా ప్రజలంతా రాష్ట్ర విభజనకు ఒప్పుకున్నట్లేనని సీమాంద్ర మంత్రులు నమ్మకంగా చెప్పిన మీదటే ఇద్దరికి మంత్రి పదవులు, మరికొంత మందికి ప్రమోషన్లు ఇచ్చి, రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అధిష్టానం వారు. ఇప్పుడు ప్రజలు ఒక్కసారిగా వీదుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే, ఎక్కడ అదిష్టాన దేవత ఆగ్రహిస్తూందో అని, రోజు ప్రజల మనో బావాలు చెప్పే వంకతో వెళ్ళి ,"అమ్మా ఇవన్నీ ప్రతిపక్షాలు ఆదిస్తున్న డ్రామాలు. ప్రజలకు హైద్రబాద్ లో వాటా ఇస్తే చాలు అన్నీ అవే సర్దుమనుగుతాయి "అని సర్ది చెప్పి వస్తున్నారు. అందుకే ఎంత సేపు "విభజన అయిపోయింది, దాని గురించి కాకుండా ఇంకా ఇతర సమస్యలు ఉంటే కమిటీకి చెప్పుకోండి" అని సోనియా గాందీ గారు అంటుంటే అవే చిలక పలుకులు మంత్రులు ప్రజలకు చెపుతూ తమ బానిస నైజాన్ని చాటుకుంటున్నారు.

 కాబట్టి సీమాంద్రులారా! మీకు తెలంగాణా ప్రజలు శత్రువులు కారు. అలాగే, ముక్కు సూటిగా మాట్లాడే ఏ నాయకుడు శత్రువు కాడు. తెలుగు జాతి ఐఖ్యతను బలిపెట్టి, తుచ్చమైన పదవులు పొంది మిమ్మలను మబ్య పెడుతున్న శీమాంద్ర మంత్రులే తెలుగు జాతికి ప్రదమ శత్రువులు. వారి కల్ల బొల్లి మాటలను కాదు నమ్మాల్శింది. వారి చేతలను మాత్రమే విశ్వసించండి. అవసరమయితే మరొక నూతన రాజకీయ పార్టి క్రింద ఏకం కండి.ఆ నాడు అన్న నందమూరి విషయంలో ఎలాగైతే డీల్లీ పాలకులకు బుద్ది చెప్పారో,ఆ తరహాఅ లోనే తెలుగు జాతి ఐఖ్యతను చాటండి. అంతవరకు విశ్రమించకండి. ఇది తెలంగాణా వారికి వ్యతిరేఖంగానో, ఆంద్రా వారిక్ అనుకూలంగానో చెపుతున్నది కాదు. తెలుగు జాతి పరువును దీల్లీ పాలకుల పాదాల ముందు పెట్టి పదవులు పొందిన నాయకుల నీచ మనస్తత్వానికి వ్యతిరేకమ్ గా మాత్రమే ఒక తెలుగు వాడిగా నా  స్పందన. రాష్ట్ర విభజన అయినా సరే అది అన్నదమ్ముల పంపకం లా ఉండాలి తప్పా,డిల్లీ పాలకుల కోసం  జాతి  పరువు బజారుకీడ్చేలా ఉండరాదన్నది నా నిశ్చితాభిప్రాయం.        
        

Tuesday, August 6, 2013

సీమాంద్ర అడుక్కు తినే వాళ్ళ J.A.C కూడా ఉద్యమం చేస్తుందట !



                                                                


   ఇన్నాళ్ళు తెలంగాణా కోసం రకరాల J.A.C. లు తెలంగాణా లో ఉద్యమం సాగించాయి  వాటి క్రుషి పలితమో ,సోనీయమ్మ కరుణ పలితమో తెలంగాణా ప్రత్యేక రాష్త్ర ఏర్పాటు ప్రకటించడం జరిగింది .ఇప్పుడు ఉద్యమ ఊపు సీమాంద్రలో షురూ  అయింది . తెలంగాణాలో ఏ విదంగా ఉద్యమాలు చేసారో అదే విదానం సీమాంద్రలోను "సమైఖ్యాంద్ర " కోసం కోన సాగుతుంది . మంత్రుల ఇళ్ళ ముట్టడి దగ్గర్నుంచి రోడ్ల మీద వంటా వార్పూ దాకా అదే స్టైల్ . కాకపోతే సీమాంద్ర ఉద్యమంలో అన్ని వర్గాల j.a.c.  లతో పాటు బిచ్చగాళ్ళ J.A.C.  అదేనండి అడుక్కు తినేవాళ్ల J.A.C. కూడా  ఉద్యమంలో చురుకుగా పాల్గొంటుందట !.

అది విన్న నాకు ఆశ్చర్యం వేసింది . ఇదేమిటబ్బా ! తెలంగాణా ఏర్పడితే సీమాంద్రా బిచ్చ గాళ్ళకి కలిగే నష్టమేమిటా అని ,తెగ ఆలోచించగా, ఆలోచించగా టక్కున ప్లాష్ అయింది సమాదానం . అసలు సీమాంద్రా వారు ఉద్యమం చేసేదే హైదరాబాద్ కోసం . హైదరాబాద్ తమ చేజారిపోతే , ఉద్యోగ అవకాశాలు లేని తమ పిల్లలు సీమాంద్రాలో బొచ్చె పట్టుకుని అడుక్కోవాల్సి వస్తుందని సీమాంద్రుల వాదన . మరి అదే నిజమయితే సీమాంద్రలో ఇప్పుడ్డున్న అడ్డుక్కు తినే వారికి హెవీ కాంపిటీషన్ ఏర్పడే ప్రమాదముంది కాబట్టి , ముందుగానే జాగర్తపడి ,ఉద్యమం లో పాలు పంచుకుని ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఆపు చేస్తే , తమ వృత్తికి బంగం కలగదని , ముందు చూపుతో ,అడుక్కు తినే వారంతా J.A.C. గా ఏర్పడి ఉద్యమం చేస్తున్నారన్న మాట !

 చూసారా ,అడుక్కు తినే వారైన వారికున్న ముందు చూపు ఎంత గొప్పదో! కనీసం వీరికున్న పాటి ముందు చూపు సీమాంద్ర రాజకీయ నాయకులకు లేదాయే! సీమాంద్ర ప్రజల మెడలు సోనీయా చేతిలో పెట్టి తమాషా చూస్తున్నారు . సిమాంద్ర ప్రజలు ఇక రాబోయే ఎలక్షన్ లలో రాజకీయ నాయకులని బదులు అడుక్కు తినే వారిని నిలబెట్టి గెలిపిస్తే కనీసం నిరుద్యోగులకు అడుకునే రాత తప్పిస్తారు .విష్ యూ బెస్ట్ ఆప్ లక్ .


Monday, August 5, 2013

అర్దరాత్రి చెల్లెలునే బయటకు గెంటిన వాడు ఆంద్రోళ్లను గెంటడని గ్యారంటీ ఏమిటి?



                                                                       


  తెలంగాణా ప్రజల మీద ఆంద్రావారికి అనుమానాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ , కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారి మీద బోల్డన్నీ అనుమానాలున్నాయి  అరే ! తెలంగాణా ఇస్తామని కాంగ్రెస్ వారు ప్రకటించి రెందు రోజులు కాక ముందే చెల్లెలు రాములమ్మను అర్ద రాత్రేళా సస్పెండ్ చేసిండా ! అంటే ఏమిటి ? ఆడబిడ్డను  అడగకుండా బయటకు పంపిండు కదా!  ఆడబిడ్డనే అర్దరాత్రి బయటకు పంపినోడు , అగర్బ శత్రువులు లా చూసే వారిని ,అదేనండి ఆంద్రోలను బయటకు పంపకుండా ఉంటాడా ? అదిగో ఆ డౌట్  తోటే ఆంద్రోళ్లంతా ఆందోళన చేస్తున్రు . లేకుంటే విదేశాలు పోయి బ్రతికేటొరికి తెలంగాణా లో బ్రతకడానికి భయమెందుకు ?

  పాపం రాములక్క !  ఏమన్నది ! జై తెలంగాణాయే అన్నది కాని , జై సమైఖ్యాంద్ర అనలేదు కదా.  వేళా కలవకుంట్ల చంద్ర శేఖర్ గారి పొటోలు తీసి వేసి ఇందిరమ్మ పొటోలు తన ఆఫిసుకాడ పెట్టిందనుకో . అందుకు రీజన్ అడిగి నోటీస్ ఇవ్వాలే కానీ , చెప్పా చెయ్యకుండా అర్ద రాత్రి గెంటుతావా పార్టీ లోంచి . ఆడబిడ్డకు ఎంత అవమానం ,
ఎంత అవమానo . అయ్యో ,రాములక్కా , నీ కెంత కష్టం వచ్చిందే !. తెలంగాణా కోసం అన్న అడుగు జాడల్లో నడచిన దానికి నీకు దొరికిన దొరికిన బహుమానం అవమానమేనా అక్కా !

  అసలు నాకు ఉన్న చిన్న అనుమానం ఏమిటంటే , అంత అవమానంగా , అక్కను బయటకు పంపితే , ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు . ఎందుకని ?తెలంగాణా కోసం అక్క చేసిన త్యాగం అదే నండి, సినిమా బందూక్ వదిలేసి వచ్చి , బయట బందులలో పాల్గొని రియల్ గా జైలుకు వెళ్ళింది కదా ! ఆ విశ్వాసం అన్నకు లేకపోయినా , తమ్ముళ్ళకు ఉండొద్దా ? పాపం మనసాగబట్టక చివరకు కలవకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిఅన్న కూతురు ఒచ్చి ఓదార్చిందట . అందుకే చెప్పేది ,అన్న అయినా ,తమ్ముడు అయినా వాళ్ళంతా మగాల్లే కాబట్టి వారికి ఆడవారి కష్టాలు తెలియవు మరి ! ఇకనైనా రాములక్కా , మగవాళ్ళ ను నమ్ముకోకుండా ఆడవాళ్ళని నమ్ముకుంటే మంచిది . 

Saturday, August 3, 2013

పెట్టుబడిదారుడు వద్దంటా ! పొట్టకూటి కోసం వస్తే ముద్దంటా !

               
                                                    



 అయ్యా హరీశ్ రావు గారు ! మీ చీర్ ఫుల్ పేస్ చూసి తెలంగాణాకి ముఖ్యమంత్రి మీరైతేనే బాగుంటుందని తెలంగాణా వాళ్ళు అనుకుంటున్నారు  కానీ నిన్న మీరన్న మాటలు చూస్తె తెలంగాణా అభివృద్ధి ఏదో ఆయేట్టట్టే అనిపిస్తుంది .
  ఎట్టెట్టా ! తెలంగాణా కి పెట్టుబడిదారులు  వస్తే వద్దంటావా ! పొట్టకూటి కోసం వస్తే రమ్మంటావా ! ఏ "తెలంగాణా " లో అటు మొదటి అక్షరం ,ఇటు చివరి అక్షరం తీసేసిన రాష్ట్రం గా మారుదామనుకుంటున్నావా ? అసలు ఒక పెట్టుబడి దారుడు వస్తే వేయి మందికి ఉపాది కల్పించే పరిశ్రమ పెడతాడు కాబట్టి రాష్ట్రం అభిరుద్ది చెందుద్ది . కాని వేల మంది పొట్ట కూటి  కోసం వస్తే ,తెలంగాణా కి ఏమి ఒరుగుద్ది . వలసవాదుల తాకిడి తప్పా! వారికి పుడ్ అని ,బెడ్ అని "k.c.r  గృహ కల్ప " అని రాష్ట్ర ఖజానా కి బొక్క అవ్వడమే కాక ,ఇక్కడి ప్రజలకు పని పాఠాలలో పోటీ .

  అంద్ చేత కమ్మూనిస్ట్  మాటలు కట్టి పెట్టి ,నూతన  రాష్ట్ర అభిరుద్ది గురించి మీకున్న విదానమేంటో , మీ మామ గారిని అడిగి చెప్పండి . లేకుంటే తెలంగాణా ప్రజలు ,మీ పట్ల వారికి ఉన్న విజన్ మార్చుకోవలసి ఉంటుంది మరి !

Friday, August 2, 2013

విడాకులు అయితే ఇచ్చేశాం , కాని పదేండ్లు కలసి ఉండక తప్పదు !


                                                               

అంద్రా  తెలంగాణా వీలీనాన్ని, పజల్ ఆలీ కమీషన్ మొదలు రాజకీయ వాదులు దాక , చాలా మంది బార్యా బర్తల సంబందం గానే పరిగణించారు . ఒక తెలివి గల అబ్బాయికి ,అమాయకురాలైన అమ్మాయికి మద్య జరిగిన పెండ్లి లాంటిది వీలీన ప్రక్రియ, అని కూడా  అన్నారట ! అలాగే కొన్నాళ్ళు కలసి ఉన్నాక పొసగటం లేదని బావిస్తే , తిరిగి ఎవరి దారిన వారు అంటే, తెలంగాణా వారు విడిపోవచ్చు అని కూడా  అన్నారట ! కాని పాపం అమాయకులు అయిన తెలంగాణా వారు , తెలివి గలవారైనా ఆంద్రా వారు కీచులాడుకుంటు , కాట్లాడుకుంటు ఎలాగో ఇన్నాళ్ళు ఓపికగా కాపురం చేస్తూ వచ్చారు .

    మరి యాబై యేండ్ల పై చిలుకు కాపురం లో అమ్మాయి ఇంటినే (హైదరాబాద్ ),తన ఇల్లుగా బావించి అబ్బాయి ఇంట్లో సొమ్ము కూడా  తెచ్చి , అమ్మాయి ఇంటిని హైటెక్ ఇంటిగా మార్చాడు . కాని ఆ  వంకతో అమ్మాయి తరపు వారిని, అబ్బాయి తరపు వారు కొంచం చిన్నచూపు చూస్తున్నారని , ఇక  మీ ఇంటికి మీరు వెళ్ళాల్సిందే, అని అమ్మాయి తరపు వారు గొడవ చేస్తే , విడాకులు మంజూరు చేసే పెద్ద మనిషి  అందరి అభిప్రాయాలు అడిగితే , ఆ... అరవై యేండ్లు కలసి ఉన్న వారిని విడదీస్తారంటలే....  , అనుకుని తమ వాళ్ళని ఎవరిని అడగకుండా , అబ్బాయి తరపు పెద్ద మనుషులు మీ ఇష్టం అనే సరికి , ఆ  పెద్ద మనిషి కాస్తా విడాకులు మంజూరుకు o.k.  అన్నాడు. అంతే ! అబ్బాయి తరపు వారికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది .

    అమ్మాయి ఇల్లు తమదనుకుని ఇన్నాళ్ళూ "హైటెక్ " గా అభిరుద్ది చేస్తే , ఏదో పది ఏండ్లు ఇక్కడే  ఉండి ,  తర్వాత మీ ఇంటికి వెళ్ళ మంటా రేమిటి ? ఇదెక్కడి తీర్పు ! అని అబ్బాయి తరపు వారు పెద్ద గొడవ చేస్తుంటే ,పెద్ద మనుషులు తాము చేసిన తప్పిదం గుర్తు వచ్చి , తేలు కుట్టిన దొంగలా ఏమనలేక , ఆ  విడాకులు ఇచ్చిన పెద్దమనిషి ఇలా చేస్తాడు అని ఊహించలేదని , ఇప్పుడు మీరేమి చేసినా మేమేమి మాట్లాడం అని , ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చేసరికి , రెచ్చిపోయిన అబ్బాయి తరపు వారు ఆ విడాకులు మంజూరు చేసిన పెద్ద మనిషిని బండ బూతులు తిడుతూ , ఆ హైటెక్ ఇంటిని వదలుకునే ప్రసక్తి లేదని కారాలు , మిరియాలు నూరుతున్నారు .. ఇదీ ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణా , సీమాంద్రల విడాకుల వ్యవహారం .

  నాకు ఒక డౌట్  ఏమిటంటే ,ఒక సారీ విడాకులు ఇచ్చాక , మళ్లీ  పదేండ్లు ఒకే ఇంటిలో వేర్వేరు కాపురాలు చేసుకొమ్మని తీర్పు చెప్పటం వివేకమైనదేనా ? ఈ  పదేండ్లలో ఆ మాజీ బార్య బర్తలు మద్య వివాదాలు రావా? వస్తే ఆ ఇంటి పరిస్తితి ఏమిటి ? మళ్లీ  ఆయనొచ్చే  మొదలేయి, !అన్నట్లు ఉండదా? సామరస్యంగా కాక కోట్లాడి  విడిపోయే వారిని ,మళ్ళి  ఏదో ఒక సాకుతో ఒక చోట ఉంచడం అంత తెలివి గల పని కాదేమో ! ఆలోచించండి.

Thursday, August 1, 2013

కోడలు చేసిన పనికి "అమ్మా కొడుకులు" అదిరి పోతున్నారు !

"వీపు నోరుని బతిమాలుద్దంట ! "నీవు వాగకే అక్కడా ,నాకు పగిలి పోద్ది ఇక్కడా " అని. అలా ఉంది "తెలంగాణా " రాష్ట్ర ప్రకటనా వ్యవహారం . అత్త  ఇందిరా గాందీ గారు చెయ్యని సాహసం కోడలు సోనియా గాందీ గారు చేసేసారు . అరవై యేండ్ల సుదీర్ఘ సమస్యను ;అలవోకగా తీర్చేశారు . ఒకే ఒక్క రోజులో రెండు మీటింగులు పెట్టి ఏక  వాక్య ప్రతిపాదనతో నాలుగు కోట్ల మందికి మోదం , మరో నాలుగున్నర్ర కోట్ల మందికి ఖేదం కలిగించారు .

     అంతే ! అప్పటి  దాక తమ మాటను కాదనదు అనే  గుడ్డి నమ్మక్కంతో నేతలు , అదే స్తాయిలో ఆంద్రా ప్రజలు ఉత్కంటతతో ఎదురు చూస్తున్న వేళ ,కోడలు గారి నిర్ణయం పిడుగు పాటులా తగిలింది . దిమ్మ తిరిగి పోయింది . నేతలు ఇండ్లకు వెళ్ళలేని పరిస్తితి . అక్కడ ప్రజలకు తమ ఆక్రోశం ఎవరిమీద చూపించాలో తెలియని పరిస్తితి . బస్సులన్నీ డీపోలోనే ఉండి పోయాయి . బయట ప్రబుత్వ వాహానాలు ఏమి తిరగడం లేదు . కోపంతో చుట్టూ చూస్తున్న వారికి నవ్వూతూ దర్శన మిచ్చారు కోడలు గారి అత్తా,ఆయనా ! అంతే ఒక్కసారిగా సుత్తులు , పలుగులూ పట్టుకుని వారి మీదకు లంఘించారు . దొరికిన విగ్రహాలను సుత్తులు పెట్టి కొడుతుంటే పాపం ఆ నాయకులకి అదిరిపోయింది . కోడలు గారికి తెలిసి ఫైర్ అయ్యేసరికి , రాష్ట్ర పోలిస్ వారు విగ్రహాల  ద్వంస కారుల పై కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు . అదీ కద !బ్రతికున్నంత కాలం శత్రువులను ఆదరగోట్టినా , చనిపోయాక , కోడలి గారి పనికి అదరగొత్తిచ్చుకోక తప్పలేదు మరి !