Wednesday, December 12, 2012

డిసెంబర్ 21 న "వీరబోగవసంతరాయులు" ఎవరో తెలిసిపోతుందట!

                                                                    

నేను "కల్కి " అవతారం అని ఒకరంటే ,నేనే"కల్కి భగవాన్" అని మరొకరు ప్రకటించుకున్నారు. "కోట్లాది రూపాయలు" ఆర్జించారు. ఆర్జిస్తున్నారు. ణెను ఈ మద్య కొన్ని వెబ్ సైట్ లు చూసాను. తమిల్ నాడుకు చెందిన కొందరు తాము "కల్కి" అవతారులమని ప్రకటించుకుని,వెబ్ సైట్ ల ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. కాని కల్కి కి మరో పేరయిన (బ్రహ్మం గారు చెప్పింది) "వీరబోగ వసంత రాయులు" తామేనని పెద్దగా ప్రచారం చేసుకున్నది ఎవరూ లేరు. ఒక్కడు మినహా!

  మన మాజి ముఖ్య మంత్రి స్వర్గీయ నంద మూరి తారక రామారావు గారు అదికారంలో ఉండగా తానే   "వీరబోగ వసంత రాయులు" అని ఒక వ్యక్తి రావడం  ప్రబుత్వ అనుమతిని సంపాదించి, "చింత మాను మటం" లోని "కాలజ్ణాన పాతర" ను త్రవ్వడానికి ప్రయత్నిస్తే, అది ప్రజలు వ్యతిరేకించడం, ఆ తర్వాత  హై కోర్ట్, ప్ర్హబుత్వ అనుమతిని రద్దు చెయ్యడం, సదరు అవతార పురుషుడు మాయమవ్వడం (జయిల్లో మరణించినట్లు వినికిడి) జరిగిపోయాయి. ఎవరో ఒక రిద్దరు తమ గురువు, "వీరబోగ వసంత రాయులు" అవతారాలని ప్రచారం చేస్తున్నా ’కల్కి" వచ్చిన "భక్త స్పందన" "వీరబోగ వసంత రాయులు" కు రాలేదు. ఆ తర్వాత "శాంబవి " అనే బాల దైవ దూత త్వరలోనే "వీరబోగ వసంత రాయులు" రానున్నడని చెప్పి, కొంత హల్ చల్ చేస్తే, "బాలల హక్కులు " గురించి తెగ బాద పడే వారు ఆ బాలికను బాద పెట్టి "దర్మ శాల"కు పంపించారు, ఇంకా వివరాలు కావాలంటే లింక్ ని క్లిక్ చెయ్యండిhttp://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_11.html.

  కాని ఇప్పట్టి దాక జరిగింది ఏమయిన కావచ్చు, మీకు డిసెంబర్ 21 న "వీరబోగ వసంత రాయులు" దర్శనం అవుతుందట!. అటడు ఆకాశం లోనుండి వస్తాడట. కోరుకున్న వారందరికి కనపడతాడట! నాకు ఒక నమ్మక్క మయిన సమాచారం ఆదారంగా చెపుతునాను. నమ్మితే ఆలౌకిక ఆనందం. లేకుంటే లౌకిక ఆనందం(జొక్ అనుకుంటే). మొత్తానికి ఆనందో బ్రహ్మా!  

2 comments:

  1. జగన్ మోహన్ రెడ్డి గారే వీరభోగ వసంత రాయలు

    ReplyDelete
    Replies
    1. అంటె డిసెంబర్ 21 న జయిల్ నుంచి బయటకు వస్తాడని అర్థమా?

      Delete