Thursday, November 29, 2012

పండితులు రాసిన పంచాంగాలు కల్లలై పోవును,శూద్రులు చెప్పిందే నిజమై నిలుచు!

                                                                       

 ఈ మాట బ్రహ్మం గారు తన కాలజ్ణానం లో చెప్పిన మాట. ఇది చాల కరెక్ట్ అనిపిస్తుంది. లేకపోతే ఏమిటి చెప్పండి.మన్వంతరం అంటే కోట్ల సంవత్సరాలు అంట! అటువంటివి ఆరు గడచిపోయినవంట! ఏడోది ఒక పాదమే అయిందట. అలాగే కలియుగం లక్షల సంవత్సరాలంట! ఆ కల్కి పుట్టేది లక్షల సంవత్సరాల తరవాతే నంట!అప్పటిదాక ఈ పాపాలు ఇల కొనసాగాల్శిందేనంట.అసలు వీటిలో ఒక్కట్టైన నమ్మదగిన కనీసం నమ్మొచ్చు అనే అవకాశం ఉందా?

  అదే మయన్లు చూడండి వారి పంచాంగం (కాలెండర్) కి ఒక ప్రామాణికత ఉన్నట్టు తోస్తుంది.ఖచ్చితంగా ఇక్కడితో ఈ కాలెండర్ పూర్తి అయి తిరిగి కొత్తది మొదలవుతుంది అనేది రాశారు . మరి ఈ హిందూ పండితులు ఎందుకు ఇలా లక్షలు, కోట్లు సంవత్సరాలు ఈ లెఖ్కల్ని పొడిగించారు అంటె భయంతో కూడిన స్వార్దం. అవును అందుకే వీరు అలా చేసారు అనిపిస్తుంది. ఎలాగంటే:-

  "విష్ను పురాణంలో రాబోయే మన్వంతరం శూద్రులుకు(కొంత మంది ద్రుష్టిలో రాక్షసులు),సంబందించింది. ఈ మన్వంతరంలో,పరమాత్ముడు శూద్ర జన్మ ఎత్తాలి,ఇంద్ర పదవి శూద్రుడిదే, మహరుషులు కూడ వారే కాబట్టి ఈ  మన్వంతరం రావడానికి ఒప్పుకోని "పండిత పుత్రులు" బవిష్యగ్రంథాలలో సున్నాలు చొప్పించి ప్రక్షిప్తం చేసారు. కాని మూర్కులు కాలాన్ని ,దైవ నిర్ణయాన్ని ఆపగలరా? అది శూద్రులయిన మయన్ల రూపంలో ప్రపంచానికి తెలుస్తుండి.

  ఈ విదంగా బ్రహ్మం గారి జ్యొస్యం నిజమవుతుంది> శూద్రుడు ఇంద్రపదవి పొందడం గురించి తెలుసుకోవాలంటే లంకె మీద క్లిక్ చెయ్యగలరు  http://kalkiavataar.blogspot.in/2012/11/blog-post_1640.html

No comments:

Post a Comment